కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్ మూవీగా సంచలనం చేస్తున్న" ఐ " తెలుగులో 'మనోహరుడు' గా వస్తున్న సంగతి తెలిసిందే. 180 కోట్ల సినిమాగా ప్రచారం జరుగుతున్న ఈ సినిమాను గత మూడేళ్ళగా శంకర్ చెక్కుతున్నాడు. ఈ దీపావళికి దాదాపు 15వేల ధియేటర్లలో విడుదల అవుతుంది అని వార్తలలో నిలుస్తున్న ఈచిత్ర దర్శకుడు శంకర్ పారితోషికం విషయంలో కూడ రికార్డును క్రియేట్ చేసిందని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం చేసినందుకు దర్శకుడు శంకర్ కు ఈ సినిమా నిర్మాతల ద్వారా 20 కోట్ల పారితోషికం ముట్టింది అని టాక్. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ దర్శకుడు అందుకోనంత భారీ పారితోషికాన్ని శంకర్ అందుకుని రికార్డు క్రియేట్ చేసాడని మీడియా వార్తలు రాస్తోంది.  ఇది ఇలా ఉండగా సెప్టెంబర్ 15 చెన్నైలో గ్రాండ్ రేంజ్‌లో జరిగే ఈ ఆడియోకు ఇంటర్నేషనల్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ అతిధిగా వస్తున్నాడని న్యూస్. అంతేకాకుండా ఈ సినిమాను మరో ఇంటర్నేషనల్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ ఈ మూవీని ప్రమోట్ చేస్తాడని తెలుస్తోంది. ఏమైనా విడుదల కాకుండానే ‘ఐ’ సంచలనాలు చేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: