సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్లామర్ వార్ నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ ఒకరిని మించి ఒకరు క్రేజీ ఆఫర్స్ కోసం తెగ పోటీపడుతున్నారు. కేవలం పోటీ పడి స్టార్ ఆఫర్స్ ని చేజిక్కించుకోవటమే కాకుండా, వారి రెమ్యునరేషన్ ని కూడ ప్రతి మూవీకి పెంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు ఒక సౌత్ హీరోయిన్ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటే అది హాట్ టాపిక్ గా ఉంటుంది. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫాంలో ఉన్న ప్రతీ స్టార్ హీరోయిన్ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం అనేది చాలా కామన్ గా మారింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకూ ఇద్దరి టాప్ హీరోయిన్స్ వద్ద కోల్డ్ వార్ జరుగుతంది. వారిద్దరే తమన్న, శ్రుతిహాసన్ లు. వీరిద్దరూ కలిసి ఇప్పుడు మహేష్ బాబు నటించిన అప్ కమింగ్ పిల్మ్ ఆగడు మూవీలో నటించారు. ఈ మూవీలో శ్రుతి చేసిన ఓ స్పెషల్ సాంగ్ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. తాజాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమాలో ఒక పాటకు చిందేసిన ఈ భామ పోస్టర్ లు కొన్ని విడుదలయ్యాయి. ఆ స్టిల్స్ లో శృతినటించిన తీరు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, ఎన్నడూ లేనంత హాట్ గా శృతి కనిపించనుందని సమాచారం. శ్రీను వైట్ల వేసిన ఐటెం సాంగ్ ప్లాన్ దాదాపు విజయం సాధించేసినట్టే అని పలువురి అభిప్రాయం. దీంతో ఇదే మూవీలో హీరోయిన్ గా ఉంటున్న తమన్నను మాత్రం ఎవ్వరు పట్టించుకోకపోవడం, శ్రుతిహాసన్ చేసిన సింగిల్ సాంగ్ కే, తనకి క్రెడిట్ వెళ్ళడం వంటి విషయాలు తమన్నకి నచ్ఛడం లేదంట. ఇకనుండి తను హీరోయిన్ గా నటిస్తున్న మూవీలలో, హీరోయిన్ గా సింగిల్ కార్డ్ ఉంటేనే చేస్తాననే డిమాండ్ ని సైతం తమన్న తెరపైకి తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: