ప్రస్తుతం ఇరు రాష్ట్రాలలోని మహేష్ అభిమానులు శ్రీనువైట్ల పెరుచెపితే మండిపడి పోతూ శ్రీనువైట్లను టార్గెట్ చేస్తూ మెసేజ్ లు పెడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. గతంలో మహేష్ సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా నటుడిగా మహేష్ నటనకు మంచి మార్కులు పడేవని కాని తొలిసారిగా ఆగడు సినిమా మహేష్ ప్రతిష్టను దిగజార్చి వేసిందని మహేష్ అభిమానులు తీవ్రనిరాశలో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితికి శ్రీనువైట్ల కారణం అంటూ మహేష్ అభిమానులు నిప్పులు కక్కుతూ తమ కోపాన్ని శ్రీనువైట్ల దృష్టికి తీసుకు వెళుతున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. అనవసరంగా రాంగోపాల్ వర్మను టార్గెట్ చేసి చివరకు వర్మ చేత మహేష్ పై సెటైర్లు వేసేలా అనవసరపు రగడ శ్రీనువైట్ల సృష్టిoచాడని మహేష్ అభిమానులు శ్రీనువైట్ల పై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. అదేవిధంగా శ్రీనువైట్లతో వచ్చిన అభిప్రాయభేదాలతో సినిమా నుంచి తప్పుకున్న ప్రకాష్ రాజ్ మీడియా సమావేశంలో అన్నమాటలు విలన్ సోనుసుద్ చేత వెటకారంగా చెప్పించి జరిగి పోయిన విషయాన్ని ఈ సినిమా ద్వారా గుర్తుకు చేయడం వల్ల ఆగడు సినిమాకు వచ్చిన ప్రయోజనం ఏమిటని మహేష్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇలా అందరిని టార్గెట్ చేద్దాం అనుకుని అనవసరపు సన్నివేశాలతో మహేష్ బాబు ప్రతిష్టను 'ఆగడు' లో శ్రీనువైట్ల దిగజార్చాడు అంటూ గగ్గోలు పెడుతున్నారు మహేష్ అభిమానులు. ఇక ఈ వార్తలు ఇలా ఉండగా ఆగడు పరాజయాన్ని కోన వెంకట్ తన మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లు గా ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. దీనికి తోడు కొన్ని చానెల్స్ తమ విశ్లేషణలలో కోన వెంకట్ లేకపోవడం వలెనే ఆగడు కు ఈ పరిస్థితి అంటూ ప్రసారం చేస్తున్న విశ్లేషణలు శ్రీనువైట్ల పరిస్థితిని మరింత దిగ జారుస్తున్నాయి. మరికొందరు విమర్శకులు అయితే మరోఅడుగు ముందుకు వేసి చరణ్ శ్రీనువైట్లల సినిమా ఆగిపోతుంది అనే ప్రచారానికి తెరతీస్తున్నారు.  ఇలా ఎలా చూసుకున్నా 'ఆగడు' మహేష్ క్రేజ్ కు అడ్డుకట్ట వేసే సినిమాగా, అదేవిధంగా శ్రీనువైట్ల మార్కెట్ ను పూర్తిగా తగ్గించి వేసిన సినిమాగా కూడా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: