‘రామయ్యా వస్తావయ్యా’, ‘రభస' సినిమాలు ఇచ్చిన వరుస షాక్ లతో తీవ్ర నిరాశలో ఉన్న జూనియర్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ సినిమాలో నటిస్తున్నా ఈ సినిమా పూర్తి అయిన తరువాత చేయబోయే సినిమా పై చాలా సీరియస్ గా ద్రుష్టి పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. రొటీన్ సినిమా కధలను ఎంచుకుని తన అభిమానులను కూడా మెప్పించలేని జూనియర్ ఇక తన భవిష్యత్ సినిమాల కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే గట్టి నిర్ణయం తీసుకున్నట్లుగా జూనియర్ సన్నిహితులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వివిధ దర్శకుల పేర్లు తన తర్వాతి సినిమా కోసం పరిశీలిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రస్తుతం బాలీవుడ్లో ‘గబ్బర్' సినిమా చేస్తున్న డైరెక్టర్ క్రిష్‌తో ఎన్టీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే క్రిష్, జూనియర్ల కాంబినేషన్ లో వచ్చే సంవత్సరం ఒక సినిమా ఉండబోతుంది అనే వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఒక పవర్ ఫుల్ స్టోరీని క్రిష్ జూనియర్ కోసం రెడీ చేస్తున్నాడని టాక్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తాడు అనే వార్తలు కూడ ఉన్నాయి. మంచి నటుడిగా పేరున్నా, విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్నా విజయాలు లేక సతమతమవుతున్న జూనియర్ స్థితిని క్రిష్ తన దర్శకత్వ ప్రతిభతో మార్చగలడా అనే ప్రశ్నకు రానున్న కాలమే సమాధానం ఇస్తుంది అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: