మంచి నటుడిగా పేరు ఉన్నా వరస పరాజయాలతో సందీప్ కిషన్ యంగ్ హీరోల రేసులో వెనక పడ్డాడు. అయితే ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సక్సస్ తో తిరిగి తన సత్తా చాటడానికి టాలీవుడ్ లో ప్రయత్నిస్తున్నాడు సందీప్ కిషన్. ప్రస్తుతం సందీప్ కిషన్, రాశీ ఖన్నాలు జంటగా తెరకెక్కుతున్న సినిమా పేరును 'జోరు' గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. 'గుండెల్లో గోదారి' ఫేమ్ కుమార్ నాగేంద్ర ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు సినిమా షూటింగ్ పార్ట్ అంతా పూర్తి కావచ్చిన ఈ సినిమాకి సంబంధించి ఇటీవలే ఓ ఐటమ్ సాంగ్‌ని చిత్రీకరించారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ పాటకు సంబంధించి ఒక ఆశక్తికర వార్త ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. గతంలో చిరంజీవి నటించిన 'అల్లుడా మజాకా' లో ముగ్గురు హీరోయిన్లతో చేసిన 'అత్తో అత్తమ్మ కూతురో' అలాగే నాగ్ హీరోగా వచ్చిన 'హలో బ్రదర్' సినిమాలో ఆమని, ఇంద్రజ, రంభలతో చేసిన రొమాంటిక్ సాంగ్ 'కన్నె పిల్లరో కన్ను కొట్టరో' వంటి పాటల ఛాయలు ఉండేటట్లుగా ఈ పాటను రాశి ఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మా లు సందీప్ కిషన్ తో రెచ్చిపోయి డాన్స్ చేస్తూ ఉంటే ఈ సినిమా దర్శకుడు చిత్రీకరించాడు అని టాక్.  ‘ఊహాలు గుసగుస లాడే’ సినిమాలో ఎంతో చక్కగా కనిపించిన రాశి ఖన్నా అవకాశాల కోసం తన శక్తి మేరకు ఈ సినిమాలో చేసిన స్కిన్ షో అదనపు ఆకర్షణ అని అంటున్నారు. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అందించిన వెరైటీ ట్యూన్ ఈ సినిమాను హిట్ ట్రాక్ లోకి మళ్ళిస్తుంది అనే నమ్మకం పై ఉన్నారట.   

మరింత సమాచారం తెలుసుకోండి: