నిన్నరాత్రి భాగ్యనగరం శిల్ప కళా వేదిక పై జరిగిన సాయిధరమ్ తేజ్ ‘పిల్లా నీవు లేని జీవితం’ ఆడియో వేడుక మెగా హీరోల బలప్రదర్శనకు వేదికగా మారింది. అయితే అభిమానుల ఉత్సాహంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నామస్మరణ చేయకుండా మెగా హీరోలు తప్పించుకోలేకపోయారు.  వేదిక ఫై మాట్లాడిన అల్లుఅర్జున్ ఏదోవిధంగా అభిమానుల అరుపుల మధ్య వస్తున్న పవర్ స్టార్ నామస్మరణ తట్టుకున్నా రామ్ చరణ్ మాత్రం ఆ ఒత్తిడి తట్టుకోలేక తన బాబాయ్ పవన్ పై వ్యాఖ్యలు చేసాడు ''మీరు అరిచి, నేను అరిచి, అందరూ అరిస్తే బాగోదు కనుక తాను అరవడం లేదు కానీ పవర్ స్టార్ గురించి నాకు కూడా మీలాగే అరవాలనుంది ఆయన ఈ హాల్లో వుంటే బాగుంటుందని మేం కూడా కోరుకుంటున్నాం '' అని అంటూ తమ కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానుబంధాలను ప్రతిసారి బహిరంగంగా వ్యక్త పరచలేము అని అంటూ మెగా అభిమానుల ఉత్సాహాన్ని చల్లార్చడానికి ప్రయత్నించాడు చరణ్. అయితే చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు కూడా మెగా అభిమానుల నుండి పవన్ ప్రస్తావన వచ్చినా తెలివిగా పవన్ పై తాను ఏమి వ్యాఖ్యలు చేయకుండా తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గురించి మిగతా యూనిట్ సభ్యుల గురించి మాట్లాడి పవన్ ప్రస్తావన లేకుండానే తన ఉపన్యాసాన్ని తెలివిగా ముగించాడు. అత్యంత ఘనంగా జరిగిన ఈ సినిమా ఆడియో వేడుకలో మొదటి నుంచి చివరి వరకు పవన్ కల్యాణ్ ఎక్కడ అనే అరుపులే అభిమానుల నుంచి వినిపించడంతో పవన్ లేకుండా మెగా హీరోల సినిమా ఫంక్షన్ జరపడం ఎంత కష్టమో మరోసారి తెలియ చేసాలా చేసింది .  ఈ సినిమా ఆడియో వేడుకలో పవన్ గురించి అభిమానులు ఇంత రచ్చ చేస్తున్న పవన్ ఈ వేడుకకు ఎందుకు రాలేకపోయాడు అనే విషయం పై ఏ మెగా హీరో క్లారిటీ ఇవ్వక పోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: