మెగా హీరో రామ్ చరణ్ తేజ్ తరువాత చిరంజీవికి ఏ మెగా హీరోపై ఎక్కువ ప్రేమాభిమానులు ఉన్నాయి వంటి విషయాలను తెలుసుకోవడం అంటే చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు రామ్ చరణ్ తరువాత, తను ఇష్టపడే మరో మెగా హీరో పేరుని, తన విశిష్ఠతని చిరంజీవి తెలియజేశాడు. తాజాగా అప్ కమింగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన పిల్లా నువ్వు లేని జీవితం మూవీ ఆడియో విడుదల జరిగింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవికి, ఆయన మేనల్లుడు సాయి ధరం తేజ్ కీ ఇప్పుడు ఓ పోలిక ఏర్పడింది. అదేమిటంటే, వీరిద్దరూ నటించిన తొలి సినిమాల కంటే ముందుగా రెండో సినిమాలే విడుదల కావడం! ఈ విషయాన్ని తేజ్ నటించిన 'పిల్లా నువ్వు లేని జీవితం' ఆడియో వేడుకలో చిరంజీవి స్వయంగా వెల్లడించారు. "నా మొదటి సినిమా 'పునాదిరాళ్ళు'. అయితే, దాని కంటే ముందుగా రెండో సినిమా 'ప్రాణం ఖరీదు' రిలీజయింది. ఇప్పుడు ఇదే సెంటిమెంటు మా తేజ్ విషయంలో కూడా చోటు చేసుకుంటోంది. అలాగే, చరణ్ రెండో సినిమా 'మగధీర' మా బ్యానర్లో వచ్చినట్టుగానే, ఇప్పుడు తేజ్ రెండో సినిమా కూడా మా బ్యానర్లోనే రావడం సంతోషంగా వుంది. చరణ్ తో బాటు తేజ్ నాకు మరోబిడ్డ. తను మా ఇంట్లోనే పెరిగాడు. మొదటి నుంచీ నేను ఫాలో అయిన క్రమశిక్షణని మా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోలంతా ఫాలో అవడం ఆనందంగా వుంది" అని చెప్పారు చిరంజీవి. అంతే కాకుండా సాయి ధరమ్ తేజ్, ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేంత వరకూ తన వంతుగా అండగా ఉంటానని తెలియజేశాడు. సాయిధరమ్ తేజ్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ లో ఇక నుండి చిరంజీవి పర్యవేక్షణ కూడ ఉంటుందని అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ కి కొంత స్టార్ డం వచ్చే వరకూ చిరంజీవే దగ్గర ఉండి మరీ చూస్తాననడంతో, కొత్త దర్శకులు, నిర్మాతలు సైతం ఈ యంగ్ హీరోతో మూవీలు తీయటానికి ఆసక్తిని చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: