ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి అభిమానుల కొదవే ఉండదు. ముఖ్యంగా హీరోల కోసం అభిమానులు ఎంతకైన సాహసిస్తారు. హీరోలు అభిరుచికి తగ్గట్టుగా అభిమానులు సమాజ శ్రేయస్సు కోసం మంచి పనులు కూడ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ అభిమానికి సినిమా టికెట్ దొరకలేని ఆత్మహత్య చేసుకోవడం చాలా విషాదకరంగా మారింది. మేటర్ లోకి వెళితే, షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ అన్ని రికార్డులని బద్దలుకొడుతుంది. అయితే ఈ కామెడీ ఎంటర్టైనర్ మధ్యప్రదేశ్ లోని ఒక కుటుంబంలో విషాదం నింపింది. ఒక 21 ఏళ్ళ యువతి ఎక్కువ రద్దీ కారణంగా తన భర్త ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రానికి తీసుకువెళ్లలేదని ఒక బాటిల్ యాసిడ్ తాగింది. దీంతో ఆ యువతిని దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి చికిత్స కోసం తీసుకువెళ్ళారు. అప్పటికే ఆ మహిళ పరిస్థితి ఇప్పుడు విషమంగా వుంది. వైద్యం చేస్తుండగా ఆ మహిళ మరణించినట్టుగా వైద్యులు దృవీకరించారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అయితే విషయం తెలుసుకున్న షారుఖ్ ఖాన్, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు త్వరలోనే వెళ్ళనున్నాడని బిటౌన్ లో టాక్స్ వినిపిసుతన్నాయి. ఫరా ఖాన్ దర్శకత్వం వహించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రంలో షారుఖ్ ఖాన్, దీపిక పదుకొనె, అభిషేక్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: