టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ని కలిగి ఉన్న ఫ్యామిలీగా మెగా ఫ్యామిలీ తయారవుతుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకూ నందమూరి అభిమానుల, మెగా అభిమానులు ధీటుగా ఉండేవారు. కాని ఈ మధ్య కాలంలో మెగా క్యాంప్ నుండి వస్తున్న హీరోల సంఖ్య ఎక్కువ కావడంతో, ఈ హీరోలు మరికొంత మంది ప్రేక్షకులని వారి ఖాతాలో చేర్చుకోవడం జరుగుతుంది. దీంతో మెగా హీరోల సంఖ్య పెరగటంతో పాటు, అభిమానులు పెరిగే అవకాశం ఉంది. ఏది ఎలా ఉన్నా, ఎవరికి ఉండే అభిమాన బలం వారికి ఉండనే ఉంటుంది. అయితే తాజాగా మెగా క్యాంప్ నుండి మరో హీరో సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రి ఇవ్వబోతున్నాడు. తనే సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే, వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో రేయ్ మూవీలో నటించాడు. అయితే ఈ మూవీ అనివార్య కారణాలతో ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సెకెండ్ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ నటించిన సెకండ్ ఫిల్మ్ ఫిల్లా నువ్వులేని జీవితం, నవంబర్ 14న థియోటర్స్ ని హిట్ చేస్తుంది. దీంతో ఈ యంగ్ మెగా హీరోకి భయమేస్తుందట. ఎందుకంటే మెగా అభిమానులు సాయి ధరమ్ తేజ్ ని ఆదరించినప్పటికీ, సాధారణ సినీ ప్రేక్షకుల సాయిధరమ్ తేజ్ నటనని మెచ్చుకుంటారా? లేదా? అనేది ఈ హీరో మనస్సులో ఉందట. ఎందుకంటే అసలైన జడ్జిమెంట్ అనేది సాధారణ సినీ ప్రేక్షకుల్లోనే ఉంటుందనేది, సాయి ధరమ్ తేజ్ నమ్మే సిద్ధాంతం అంట. దీంతో సినీ ప్రేక్షకుల రిజల్ట్ ని తెలుసుకునేందుకు సాయి ధరమ్ తేజ్ కూడ తన అప్ కమింగ్ డెబ్యూ ఫిల్మ్ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: