నందమూరి కుటుంబానికి వీరాభిమాని అయిన వైవిఎస్ చౌదరి తన రూట్ మార్చి మెగా కాంపౌండ్ కు చేరి సాయి ధరమ్ తేజ్ తో తీసిన మొట్టమొదటి సినిమా ‘రేయ్’ నిర్మాణం పూర్తి చేసుకుని ఎంతో కాలo గడిచినా ఆర్ధిక సమస్యలతో ఈ సినిమా విడుదల కాలేకపోయింది అనే విషయం అందరికీ తెలిసిందే.  అయితే సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువులేని జీవితం’ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఆ ప్రభావం ‘రేయ్’ సినిమా మీద పడి ఆసినిమా విడుదల విషయంలో కదలిక వచ్చింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫిలింనగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మొన్నటి దాకా నిర్మాత చౌదరిని చూస్తే తప్పించుకు తిరిగిన చాలామంది బయ్యర్లు ‘రేయ్’ సినిమా హక్కుల కోసం ఆశక్తిని చూపెడుతున్నారని టాక్.  ఇప్పటికే రెండు, మూడు ఏరియాలకు సంబంధించి ఈ సినిమా హక్కుల విషయంలో ప్రాధమికంగా నిర్మాత చౌదరికి కొంతమంది బయ్యర్లకు ఒక అంగీకారం కుదిరింది అనే వార్తలు ఉన్నాయి. ఈ వార్తలను బట్టి సాయి ధరమ్ తేజ్ కు వచ్చిన క్రేజ్ చౌదరి కష్టాలను తీర్చడమే కాకుండా ఆ సినిమా విడుదలకు ఇంచుమించు కౌంట్ డౌన్ మొదలైంది అనే వార్తలు ఉన్నాయి. అన్నీ కుదిరితే ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కావచ్చు అనే వార్తలు ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: