మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ చరిత్రలో కథలుగా చెప్పుకునే రాజన్న చేసి అవార్డులు పొందాడు నాగార్జున. ఆ తరువాత రొటీన్ సినిమాలు చేస్తూనే షిరిడి సాయినాధుడిగా నటించి మెప్పించాడు నాగార్జున. అటువంటి నాగ్ ఆలోచనలలో ప్రస్తుతం తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీమ్ ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి.  ఈమధ్యనే ఒక ప్రముఖ దర్శకుడు నాగార్జునను కలిసి ఈ సినిమాలో నటించవలసిందిగా నాగార్జునను కోరినట్లు సమాచారం. అయితే రాజన్న సినిమా మిగిల్చిన చేదు అనుభవంతో నాగ్ తన నిర్ణయాన్ని తెలపకుండా కొంతకాలం తరువాత ఆలోచిస్తాను అని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.  ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ లాంటి భక్తి చిత్రాలనే కాదు ఇప్పటికీ ఇద్దరు హీరోయిన్స్ కు హీరోగా నిజంగానే వెండి తెర మన్మధుడిగా ఇమేజ్ ఉన్న నాగార్జున తిరిగి ఆ తెలంగాణ పోరాట యోధుడు పాత్రను పోషిస్తే ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రం వేరుగా ఏర్పడిన నేపధ్యంలో తెలంగాణా ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకునే అవకాశం ఇప్పుడు ఉన్న టాప్ హీరోలలో ఒక్క నాగార్జునకే సొంతం చేసుకునే అవకాశం ఉంది.  మరి నాగ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. అయినా నాగార్జున ప్రస్తుతం ఇద్దరి హీరోయిన్స్ మధ్య ‘సోగ్గాడే చిన్నినాయన’ గా తిరిగ బోతున్నాడు కాబట్టి కొమరం భీమ్ గా మారడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: