ఒకవైపు ‘జబర్దస్త్’ కామెడీ షో బుల్లితెర పై తన రేటింగ్స్ ను పెంచుకుపోతూ ఉంటే మరో వైపు ఈ కామెడీ షో ప్రతిరోజు ఎదో ఒక వివాదంలో కూరుకు పోతోంది. ఈ షో ద్వారా ప్రాచుర్యం పొందిన హాస్య నటుడు వేణు పై నిన్న దాడి జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.  హైదరాబాద్ ఫిలించాంబర్ వద్ద ఉన్న ఒక ఆలయo వద్ద వేణు పై ఈ దాడి జరిగినట్లు వార్తలు ఉన్నాయి. దెబ్బలు తగిలిన తరువాత వేణును దగ్గరలోని ఒక హాస్పటల్ కు తీసుకు వెళ్ళినట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈనెల 18వ తేదీ రాత్రి ప్రసారమైన ఈ షోలో వేణు ఓ సామాజిక వర్గానికి చెందిన వారి జీవన విధానాన్ని హేళన చేసేలా నటించడoతో ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు వేణుతో ఘర్షణకు దిగి ఆ తరువాత ఈ దాడి చేసినట్లు చెపుతున్నారు.  జబర్దస్త్ కార్యక్రమంలో ప్రసారం అవుతున్న స్కిట్స్ పై విమర్శలు రావడం ఇది మొదటిసారి కాదు. ఈమధ్యనే కరీం నగర్ కు చెందిన ఒక లాయర్ న్యాయవస్థ పై సెటైర్లు వేస్తూ ప్రసారం కాబడ్డ ఒక ఎపిసోడ్ ను ఉదహరిస్తూ ‘జబర్దస్త్’ కార్యక్రమాన్ని నిషేధించవలసిందిగా న్యాయస్థానం మెట్లు ఎక్కినా విషయం తెలిసిందే.  రోజురోజుకు ‘జబర్దస్త్’ పై పెరిగి పోతున్న వివాదాల నేపధ్యంలో ఈ కార్యక్రమ నిర్వాహకులు తమ పద్ధతిని మార్చుకుంటారేమో చూడాలి..   

మరింత సమాచారం తెలుసుకోండి: