‘ హృదయ కాలేయం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బర్నింగ్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సంపూ బాబు పై ఒక షాకింగ్ న్యూస్ హడావిడి చేస్తోంది.ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా విన్న వారికి మాత్రం మైండ్ బ్లాంక్ అవుతోంది. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం రేపు విడుదల అవుతున్న ‘బందిపోటు’ సినిమాలో నటించినందుకు సంపూర్ణేష్‌ బాబు అల్లరి నరేశ్ దగ్గర 25 లక్షలు పారితోషికంగా తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

‘బందిపోటు’ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో సంపూ కనిపిస్తున్న సందర్భంలో ఇతడికి ఈ భారీ పారితోషికం ఆఫర్ చేసారని టాక్. అదీకాక ‘బందిపోటు’ సినిమాకు సంబంధించి చానల్స్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలలో కూడా అల్లరి నరేశ్ తో సమానంగా సంపూని చూపెడుతూ ఉండటం బట్టి అల్లరోడు కూడా సంపూ క్రేజ్ లో పడిపోయాడా అని అనిపించేలా చేస్తోంది.

అయితే లేటెస్ట్ గా సంపూ ‘పెసరట్టు’ సినిమాలో గెస్ట్ గా కనిపించినా అది ఏమంత విజయవంతం కాలేదు. ఈ వార్తలు ఇలా ఉండగా మంచు విష్ణు సొంత బ్యానర్ లో ‘సింగం 123’ టైటిల్ తో ఒక సినిమా, వైరస్ డాట్ కామ్ పేరుతో మరో సినిమా ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో ఈ సినిమాలకు కూడ సంపూ భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ విలక్షణ నటుడు నటించిన ‘కొబ్బరి మట్ట’ విడుదలకు ముస్తాబు అవుతూ ఉండటంతో ప్రస్తుతం ఫిలింనగర్ లో మాత్రం సంపూ పారితోషికo పైనే రకరకాల వార్తలు హడావిడి చేస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: