‘బ్రూస్ లీ’ విడుదల ఖరారు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి విజయ దశమి కి రాబోతున్న అఖిల్  సినిమా పై పడింది. ఈసినిమా ప్రమోషాన్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో పాటు రిలీజ్‌ డేట్ దగ్గర పడుతున్న ఈఫిల్మ్ గురించి ఇటు ప్రొడ్యూసర్‌ కానీ అటు హీరోకానీ సైలెంట్‌గా ఉండడంతో అనేక అనుమానాలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. 

దీనితో  అక్టోబరు 22న ‘అఖిల్’ అనుకున్న విధంగా విడుదల కాదేమో అన్న టెన్షన్ లో అక్కినేని అభిమానులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఒక వైపు ‘రుద్రమదేవి’ మరో వైపు ‘బ్రూస్ లీ’ లతో ఇరు రాష్ట్రాలలోని థియేటర్స్ నిండి  పోవడంతో ‘అఖిల్’ విడుదల ఇప్పుడు ఒక ప్రశ్నార్ధకంగా మారింది. అయితే అఖిల్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈనెల 17న వైజాగ్‌లో ఒక భారీ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. 

‘అఖిల్’ ఆడియో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ను వైజాగ్ లోని గీతం కాలేజీ కాంపస్ లో చాల భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్టణంలోని అన్ని ప్రముఖ కాలేజీ విద్యార్ధులు పాల్గొనే విధంగా ఈకార్యక్రమాన్ని డిజైన్ చేసారు అని టాక్. ఈ కార్యక్రమంలో అఖిల్ విడుదలపై ఒక స్టేట్‌మెంట్ వచ్చే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈవారం విడుదల అవుతున్న ‘బ్రూస్ లీ’ హిట్టయితే ‘దీపావళి’ కి ‘అఖిల్’ ను తీసుకురావాలని ఇప్పటికే ఈసినిమా దర్శక నిర్మాతలు ఒక నిర్ణయం తీసుకున్నారు అని టాక్. అయితే అనుకోకుండా ‘బ్రూస్ లీ’ ఫ్లాప్ అయితే అఖిల్ ను అనుకున్న విధంగా విజయదసమికి తీసురావలలని మాస్టర్ స్కెచ్ వేసారని వార్తలు వస్తున్నాయి. దీనితో రాబోతున్న 17వ తారీఖు అఖిల్ విడుదల తేదీని నిర్ణయించే తేదీగా మారింది అంటూ ఫిలింనగర్ లో వార్తలు హల్ చెల్ చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: