బాక్సఫీస్ వద్ద ఢమరుకానికి గట్టి పోటీ ఎదరువుతుంది. భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా ఢమరుకం. సోషియో ఫాంటసీ కథాంశంతో, గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకు మొదటి వారంలో కలెక్షన్లు బాగానే వచ్చాయి. అయితే, ఈ శుక్రవారం నాడు రానా నటించిన కృష్ణం వందే జగద్గుం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమాకు భారీ ఎత్తున్న ప్రచారం చేయడం, అధిక సంఖ్యలో ధియేటర్లలో విడుదల చేయడంతో రానా కెరీయర్ లోనే ఈ సినిమాకు అత్యధిక ఓపెనింగ్స్ వచ్చాయి. కృష్ణం వందే జగద్గురం సినిమా మొదటి మూడు రోజుల్లోనే 4.5 కోట్ల రూపాయిలను వసూలు చేసిందని చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి ప్రకటించారు. క్రిష్ దర్శకత్వం వహించిన కృష్ణం వందే జగద్గురం సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించడం వంటి కారణాలతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. క్రిష్ సినిమాలను అభిమానించే వారిని ఈ సినిమా బాగానే ఆకట్టుకుంటుంది. రానా ను హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తూనే, తన మార్కు చూపించడానికి క్రిష్ ట్రై చేశాడు. ఈ సినిమాకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అయినా, ఈ వారం కృష్ణం వందే జగద్గురం సినిమాకు కలెక్షన్లకు ఢోకా ఉండదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాగార్జున, అనుష్క జంటగా నటించిన ఢమరుకం సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఫ్యామిలీలను ఆకట్టకుంటున్న ఈ సినిమా లాభాలు చవిచూడాలంటే ఈ చిత్రం ఇంకా కలెక్షన్ల సాధించాలి. అయితే కృష్ణం వందే జగద్గురం సినిమా ఢమరుకం చిత్రానికి గట్టి పోటీ ఇస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: