నిన్న మెగా స్టార్ చిరంజీవి  తన ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘కంచె’ యూనిట్ ను ముఖ్యంగా దర్శకుడు క్రిష్ హీరో  వరుణ్ తేజ్ లను ఆకాశానికి  ఎత్తేస్తూ చిరంజీవి చేసిన కామెంట్స్ అల్లుఅర్జున్ కు తలనొప్పిగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బన్నీకి ఈ తలనొప్పి తన అభిమానుల నుంచి వస్తున్నట్లు టాక్.నిన్న చిరంజీవి ‘కంచె’ టీమ్ ను పొగుడ్తూ కామెంట్స్ చేసిన తరువాత ఈ కామెంట్స్ అల్లుఅర్జున్ అభిమానులవరకు వెళ్ళడంతో బన్నీ వీరాభిమానులు ఈ విషయం పై మరో విధంగా తమలో తాము కామెంట్ చేసుకున్నట్లు టాక్. 

బన్నీ అభిమానుల అభిప్రాయం ప్రకారం  ‘రుద్రమదేవి’ లాంటి చారిత్రాత్మిక సినిమాలో హీరో పాత్ర కాకపోయినా  ముందుకు వచ్చి రెమ్యూనిరేషన్ కూడా అడక్కుండా  బన్నీచేయడమే కాకుండా అచ్చమైన తెలంగాణా యాసలో మాట్లాడి ‘రుద్రమదేవి’ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన అల్లు అర్జున్ గురించి కూడా రెండు మాటలు చిరంజీవి మాట్లాడితే బాగుండేది కదా అని బన్నీ అభిమానులు కామెంట్ చేసుకుంటున్నారట.

ఈ కామెంట్స్ బన్నీ దృష్టి వరకు వెళ్ళడంతో ఇటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకోవద్దని అల్లు మెగా కుటుంబాలు ఎప్పుడు ఒకటే అని ఇలాంటి చిన్నవిషయాలు గురించి లోతుగా ఆలోచించి తన మెదడును పాడు చేయ వద్దని అల్లుఅర్జున్ తనను కలిసిన తన వీరాభిమానులకు క్లాసు పీకినట్లు టాక్.   
 

ఇప్పటికే రామ్ చరణ్ కు అల్లుఅర్జున్ ల మధ్య కొన్ని ఇగో సమస్యలు ఏర్పడ్డాయి అని  గాసిప్పులు వస్తున్న నేపధ్యంలో బన్నీ వ్యూహాత్మకంగా తన వీరాభిమానుల కామెంట్స్ కు ఆదిలోనే అడ్డుకట్ట వేసాడు అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: