గ్లామర్ బ్యూటీగా ఎన్నో సినిమాలలో నటించిన శ్రియ యూత్ పై చేసిన సంచలన వ్యాఖ్యలు టాపిక్ ఆఫ్ ది మీడియాగా మారిపోయాయి. ప్రస్థుత పరిస్థుతులలో పబ్లిక్ ఫంక్షన్లకు హాజరు కావడమంత బుద్ధి తక్కువ పని వేరొకటి ఉండదని కామెంట్స్ చేసింది శ్రియ. అయితే తమ కెరియర్ ను సంపాదనను దృష్టిలో పెట్టుకుని ఏదైనా షాపింగ్ మాల్ లేదా మరో పెద్ద కార్యక్రమo కోసం పబ్లిక్ లోకి వెళ్తే అక్కడ కుర్రాళ్ల చేష్టలు దారుణంగా ఉంటున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ క్రేజీ హీరోయిన్.  

అందుకే తనకు జనాల్లోకి వెళ్లాలంటే భయం వేస్తోందని కామెంట్స్ చేసింది శ్రియ. గతంలో తన ట్విటర్ లో తాను ఫలానా కార్యక్రమంలో పాల్గొనబోతున్నానంటూ సంతోషంగా సమాచారం ఇచ్చేదాన్నని అయితే  ఆ సమాచారం తెలుసుకుని యూత్ ఏదో చేయాలనే ప్లాన్ తో అక్కడికి వచ్చి తనను చాలా ఇబ్బంది పెట్టారని ఆమె గగ్గోలు పెడుతోంది. 
తన ట్విట్స్ చదివి తాను పాల్గొంటున్న కార్యక్రమం దగ్గరకు వచ్చి  

అభిమానం పేరుతో వెకిలిగా యూత్ ప్రవర్తించే తీరుకు తనకు బాధ  కలుగుతుందని అంటూ కామెంట్స్ చేసింది శ్రియ. అభిమానం పేరుతో దగ్గరకు వచ్చి తనను తాకడానికి కొందరు ప్రయత్నిస్తే మరికొందరు తమ చేతులతో ఒక్కోసారి నొక్కేస్తారు గిచ్చేస్తారు అంటూ యూత్ ను టార్గెట్ చేస్తోంది శ్రియ. 

ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్ చేస్తూ గ్లామర్ ఒలకబోసే శ్రియ లాంటి హీరోయిన్స్ కు కూడ నేటి యూత్ చుక్కలు చూపెడుతున్నారు అంటే సెలెబ్రెటీలే కాదు సామాన్య మహిళలు కూడ నేటి యూత్ దెబ్బకు ఎంత భయపడి పోతున్నారో అర్ధం అవుతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: