తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘రుద్రమదేవి’ ఈ సినిమా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అక్టోబర్ 9 విడుదల అయ్యింది. ఫస్డ్ డే నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు మంచి లాభాల బాటలో నడుస్తుంది.  ఇక రుద్రమదేవి పాత్రలో అనుష్క లీనమైందనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షన గోన గన్నారెడ్డి. మహబూబ్ నగర్ చెందిన గోనగన్నారెడ్డి ఒక బందిపోటు దొంగలా కనిపిస్తాడు.

ఈ పాత్రలో అల్లు అర్జున్ సూపర్ గా సెట్ అయ్యాడు.. తెలంగాణ యాస మాట్లాడుతూ.. గడ్డం పెంచుకొని నెత్తికి తలపాక చుట్టుకొని కొండవీటి దొంగలా కనిపిస్తాడు.. ఒక విధంగా చెప్పాలంటే‘రుద్రమదేవి’ చిత్రం అంత హిట్ అయ్యిందంటే గోన గన్నారెడ్డి పాత్ర ఉండటమే ప్రధాన కారణమని చాలా మంది అన్నారు. ఇప్పుడు దర్శకులు గుణశేఖర్ తదుపరి చిత్రం కోసం  స్క్రిప్ట్ పని మొదలుపెట్టాడు.  అంతే కాదు ఈ సారి కూడా భారీ బడ్జెట్ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం..దీనికోసం  'వీరాభిమన్యు'  సినిమా టైటిల్ కూడా రిజిష్ట్రర్ చేయించాడట.

రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్


ఇప్పుడు అందరి దృష్టి గుణశేఖర్ పై పడింది..టైటిల్ని బట్టి ఇది భారతకథకు చెందినదా? లేక సాంఘిక కథా చిత్రమా? అనే ఆలోచనలు ఉన్నారట. అయితే ఆ వివరాలు మాత్రం దర్శకులు బయటకు చెప్పడం లేదు. కాకపోతే ఇది కూడా 'రుద్రమదేవి'లానే భారీ బడ్జెట్టు చిత్రమనే అంటున్నారు. మరి ఈ సినిమాలో హీరో ఎవరా అని ఇప్పటికే రక రకాలు రూమర్లు వ్యాపిస్తూనే ఉన్నాయి.. కానీ గుణశేఖర్ దృష్టి మాత్రం అల్లు అర్జున్ పైనే ఉందడ..ఎందుకంటే రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డిగా మంచి నటన కనబర్చిన బన్నితో తదుపరి చిత్రం తీస్తు బాగుంటుందని బావిస్తున్నట్లు తెలుస్లుంది. అయితే గుణశేఖర్ తో సినిమా తీసేందుకు బన్నికూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: