మహేష్ కోసం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చేసిన త్యాగం ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘శ్రీమంతుడు’ ఘన విజయం తరువాత శ్రీకాంత్ అడ్డాల మహేష్ తో తీస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలును ముందుగానే బుక్ చేసారు.

అయితే ఈసినిమా షూటింగ్ ప్రారంభం కావడం ఆలస్యం అవ్వడంతో పాటు ఈ సినిమా హీరోయిన్ల  డేట్స్ సర్దుబాటు కావడం ఆలస్యం అవడంతో ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు కొనసాగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సినిమాను వచ్చే సమ్మర్ రేస్ ను ప్రారంభిస్తూ ఏప్రిల్ లో విడుదల చేసే నిర్ణయంతో ఈ సినిమా షూటింగ్ ను ఇక ఎక్కడా లేట్ లేకుండా పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు.

అయితే ఈలోపున’ శంకర్ రోబో 2’ ప్రాజెక్ట్ ఒక కొలిక్కి రావడంతో ఈ సినిమాను లాంఛనంగా రజినీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12న మొదలు పెట్టి అసలు షూటింగ్ ను వచ్చే జనవరి నుండి ప్రరంభిoచాలి అని దర్శకుడు శంకర్ ఒక నిశ్చయానికి రావడంతో ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించడానికి రత్నవేలుని రెడీ అవ్వమని సంకేతాలు ఇచ్చినట్లు టాక్. దీనికోసం  అవసరం అనుకుంటే ‘బ్రహ్మోతవం’ ప్రాజెక్ట్ నుండి తప్పుకోమని శంకర్ రత్నవేలుకు సూచనలు ఇచ్చాడని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. 

అయితే రత్నవేలు మధ్యలో ‘బ్రహ్మోత్సవం’ వదిలి ‘రోబో 2’ వైపు రాలేను అని చెప్పినట్లు టాక్. ఈ వార్తలలో ఎన్ని వాస్తవాలో తెలియకపోయినా మహేష్ కోసం 350 కోట్ల ‘రోబో 2’ ను రత్నవేలు త్యాగం చేసాడు అనే మాటలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: