తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య హీరోలు పార్టీల సెలబ్రెషన్స్ చేసుకుంటు పెద్ద హంగామా సృష్టిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఇంట్లో లేట్ నైట్ పార్టీ సందడి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇప్పటి దర్శకత్వం బాధ్యతలే తీసుకున్నాడు.. మొట్ట మొదటి సారిగా నిర్మాణ బాధ్యతలు తీసుకొని సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో రాజ్ తరుణ్, హేబా పాటిల్ తో తెరకెక్కిన 'కుమారి 21ఎఫ్‌' విడుదలై విజయవంతంగా ప్రదర్శింప బడుతుంది. అయితే ఈ విజయోత్సవాన్ని జూ ఎన్టీఆర్ ఇంట్లో ఫుల్ జోష్ లో జరిగింది.


ఈ పార్టీలో ఎన్టీఆర్ స్నేహితులు సుకుమార్ మరియు మ్యుజిక్ డైరక్టర్ దేవిశ్రీ , రత్నవేలు పాల్గోన్నారు. 'కుమారి 21ఎఫ్‌' సినిమా విషయానికి వస్తే రాజ్ తరుణ్, హేబా పాటిల్ కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. ఈ కాలంలో ఇద్దరు లవర్స్ మద్య జరిగే సన్నివేశాలు, సంభాషనలు ఇందులో నిజ జీవితంలో జరిగినట్లే చూపించారు. సినిమాలో కాస్త బోల్డ్ సన్నివేశాలు, సంభాషనలు ఉన్నా సినిమా మాత్రం ఎమోషనల్ లవ్ స్టోరీ అంటున్నారు.


 'కుమారి 21ఎఫ్‌' స్టిల్



ఈ సినిమాకు సంగీతం కూడా మంచి ప్లస్ పాయింట్ కావడంతో సినిమా హిట్ టాక్ వచ్చిందని అంటున్నారు. ఏది ఏమైనా పెద్ద సినిమాలకు పోటీగా మంచి కాంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా సక్సెస్ సాధిస్తుందని అంటున్నా చిత్ర నిర్మాత సుకుమార్. ఇక సుకుమార్, ఎన్టీఆర్ కాంబి నేషన్ లో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా సంక్రాంతికి రాబోతుంది. ఈ స్నేహ సంబంధంతోనే ఎన్టీఆర్ తన ఇంట్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.


దేవిశ్రీ ప్రసాద్ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: