సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేకమైన స్టార్ డం నిక్రియేట్ చేసుకున్న హీరోయిన్ అనుష్క. తను తాజాగా నటించిన సైజ్ జీరో మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉండటంతో, ఈ మూవీకి సంబంధించిన గాసిప్స్ పై అనుష్క రియాక్ట్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్స్ గా మారుతున్నాయి. తెలుగు,తమిళ చిత్రాల్లో వరుసగా నటిస్తూ తీరిక లేని బిజి షెడ్యూల్స్ ని గడుపుతుంది.

తాజాగా ‘సైజ్ జీరో’ సినిమా కోసం లీడింగ్ లో ఉన్న ఏ హీరోయిన్ చేయని సాహసాన్నే చేసింది. బాహుబలి లాంటి కోసం తన ఫిజిక్ ని ఎంత బాగా కాపాడుకుందో, ఆ తరువాత వచ్చిన సైజ్ జీరో మూవీ కోసం ఎటువంటి వర్కౌట్స్ చేయకుండా తన బరువుని అమాంతం పెంచేసుకుంది. దీనికి కారణంగా అనుష్క 15 కేజీలకు పైనే బరువు పెరిగింది. కేవలం నటనపై ఉన్న ఆసక్తి కారణంగానే ఈ విధంగా బరువు పెరిగినట్టు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే, ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజున సందడి చేయనుంది.

ఇక ఈ సందర్భంగా ‘సైజ్ జీరో’ టీమ్ చేసిన ప్రమోషన్ యాక్టివిటీస్ లో అనుష్క షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా అనుష్కకి అమెరికాలో  సర్జరీ జరిగిందని వచ్చిన వార్తలపై స్పంధించింది. “సర్జరీ చేయించుకున్నాను అనే వార్తలు ఎక్కణ్ణుంచి పుట్టుకొస్తాయో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఎలాగైతే సహజ పద్ధతుల్లో బరువు పెరిగానో, అలాగే సహజ పద్ధతుల్లోనే బరువు తగ్గుతున్నా. మరి నేను సర్జరీ చేయించుకుంటున్నట్లు పుకార్లు ఎలా పుట్టుకొచ్చాయి.” అంటూ చెప్పుకొచ్చింది.

అయితే కోలీవుడ్ మీడియా మాత్రం అనుష్క నిజాన్ని దాచేసింది. సర్జరీ జరిగినట్టుగా వారి దగ్గర సమాచారం ఉందని చెబుతుంది. ఎక్కడ సర్జరీ వివరాలు బయటకు వస్తే, ఆఫర్స్ మిస్ అవుతాయో అంటూ అనుష్క భయపడుతుందని అంటున్నారు. మొత్తంగా సర్జరీ మేటర్ పై అనుష్క చేసిన కామెంట్స్ మరీ ఓవర్ అని పిస్తున్నాయంటూ కోలీవుడ్ లో ప్రత్యేక కథనాలను ప్రచారం చేస్తున్నారు. ఇక పీవీపీ సంస్థ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి నవంబర్ 27న భారీ ఎత్తున విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: