ఇప్పుడు టాలీవుడ్ లో దర్శకుల అందరి దృష్టి రాజ్ తరుణ్ పైనే ఉంది. ‘కుమారి 21 ఎఫ్’ సాధించిన ఘన విజయంతో నిన్నటిదాకా చిన్న దర్శకుల హీరోగా ఉన్న రాజ్ తరుణ్ ఒకేసారి టాప్ డైరెక్టర్ల హీరోగా మారిపోయాడు. పెద్ద హీరోలతో సినిమాలుచేసి చేతులు కాల్చుకోవడం బదులు రాజ్ తరుణ్ లాంటి క్రేజీ చిన్న హీరోలతో తక్కువ బడ్జెట్ తో సినిమా పూర్తి చేసి ఎక్కువ లాభాలు తెచ్చుకోవచ్చనే అన్న ఆలోచనలతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల దృష్టి రాజ్ తరుణ్ వైపు మళ్ళింది. 

ఇప్పటికే వివాదాల రామ్ గోపాల వర్మతో సినిమాను చేయడానికి అంగీకరించిన రాజ్ తరుణ్ కు మరో బంపర్ ఆఫర్ తగిలింది అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ‘లోఫర్’ సినిమాను చేస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఇది పూర్తి కాగానే రాజ్ తరుణ్ తో తన సొంత బ్యానర్ లో ఒక సినిమా పూరి ప్లాన్ చేస్తునట్లు ఫిలింనగర్ టాక్. 

దీనికోసం పూరి రాజ్ తరుణ్ కు భారీ పారితోషికం ఆఫర్ చేసాడని టాక్. అయితే కలలో కూడ ఊహించని పూరి ఆఫర్ రాజ్ తరుణ్ ను మంచి జోష్ లో ముంచి వేసినా ఇప్పటికే తాను మాట ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ సినిమాను పక్కకు పెట్టి పూరి సినిమాను చేయాలా? లేదంటే ఈ ఇద్దరి దర్శకుల సినిమాలను ఒకే టైమ్ లో పూర్తి చేయాలా ? అన్న సమస్యలో ప్రస్తుతం రాజ్ తరుణ్ ఉన్నట్లు టాక్.

అయితే ఇప్పటికే టాప్ హీరోలను టార్గెట్ చేసి రాజ్ తరుణ్ ను ఆకాశానికి ఎత్తేసిన రామ్ గోపాల్  వర్మ తనకు రాజ్ తరుణ్ ఇచ్చిన మాట తప్పితే వర్మకు కోపం రావడమే కాకుండా ఆ కోపాన్ని తన ట్విట్స్ రూపంలో చూపెట్టి ఈ యంగ్ హీరోను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థుతులలో రాజ్ తరుణ్ కు వర్మ పూరీల మధ్య ఎవరి సినిమా ముందు అని తేల్చుకోవడం ఒక విధంగా చాల కష్టమైన సమస్య. అనుకోకుండా గురు శిష్యులు ఇద్దరి దృష్టి ఒకేసారి ఈ యంగ్ హీరో పై పడటంతో రాజ్ తరుణ్ వ్యవహారం పూరీ వర్మల మధ్య చిచ్చు రేపుతుందా అన్న వార్తలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: