సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవార్డు ఉత్సవం ఐఫా. ఇప్పుడు ఐఫా ఉత్సవం -2015 వేడుకలు హైదరాబాద్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డులు అన్ని ఇండస్ట్రీ వాళ్లకు కేటగిరి వైజ్ గా ప్రజంట్ చేస్తారు. ఇక ఈ సారి మన తెలుగు ఇండస్ట్రీలోంచి ఉత్తమ సినీ నటుడి కోసం నాలుగు సినిమాలు ఎంట్రీ అయ్యాయి. నాలుగు సినిమాల్ని కమిటీ పరిశీలించి వాటిలో హీరోల పెర్ ఫామెన్స్ పై రివ్యూ చేయబోతున్నారు.
బాహుబలి - శ్రీమంతుడు - సన్నాఫ్ సత్యమూర్తి - భలే భలే మగాడివోయ్ సినిమాలు ఐఫా బరిలో ఉన్నాయి. ఇక ఉత్తమ నటుడి లీస్టులో ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని లు ఉన్నారు. ఈ సంవత్సరం అన్నీ తెలుగు ఇండస్ట్రీలో అన్నీ సూపర్ హిట్ సినిమాలే వచ్చాయి.. బాహుబలి విషయానికి వస్తే తెలుగు ఇండస్ట్రీలోనే కాదు యావత్ భారత దేశంలో సంచలనం సృష్టించింది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చింది. ఇందులో ప్రభాస్ నటన బాగుందని అన్న వర్గాల ప్రజలు, ప్రముఖులు మెచ్చుకున్నారు. ఇక సోషల్ మెసేజ్ తో వచ్చిన శ్రీమంతుడు చిత్రంలో మహేష్ బాబు కూడా అద్భుతమైన నటన కనబరిచారు.
మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్,నాని
మనిషి విలువ గురించి తెలుపుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన ‘సన్నాఫ్ సత్యమూర్తి ’ చిత్రంలో అల్లు అర్జున్ తండ్రి విలువలు కాపాడే కొడుకుగా అద్భుతంగా నటించారు. ఇక కామెడీ ఓరియెంటెడ్ మారుతి దర్శకత్వం వహించిన భలే భలే మగాడివోయ్ చిత్రంలో మతిమరుపు పాత్రలో నాని నటన చాలా హైలెట్ గా నిలిచిపోయింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెబుతున్నారు. తాజాగా మాస్ మహరాజ రవితేజ తన అభిప్రాయం వెల్లబుచ్చారు..మతి మరుపు క్యారెక్టర్ తో ప్రయోగాత్మకంగా నటించిన నాని కి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని కోరకుంటున్నా అంటూ తన ఫేస్ బుక్ లో పెట్టాడు.