సుకుమార్ మొదటిసారి నిర్మాతగా స్టార్ట్ చేసిన మూవీ కుమారి21F. ప్రస్తుతం ఈ మూవీ థియోటర్స్ వద్ద సత్తా చాటుతుంది. అంతే కాకుండా బాక్సాపీస్ వద్ద కలెక్షన్స్ సునామినీ క్రియేట్ చేస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, కుమారి21F మూవీలో నటించిన హీరో రాజ్ తరుణ్ కి ఇప్పటి వరకూ వరుస సక్సెస్ లు పడటంతో, యూత్ సైతం రాజ్ తరుణ్ నటించిన కుమారి21F మూవీపై స్పెషల్ ఇంట్రెస్ట్ ని చూపించింది.


ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’ సినిమాలతో సంపాదించుకున్న పేరు, కుమారి21F మూవీ సక్సెస్ కి కూడ కొంత కారణం అయింది. ఇక తాజాగా రిలీజ్ అయిన ‘కుమారి 21F’ తో రాజ్ తరుణ్ హ్యాట్రిక్ హిట్స్ ని సొంతం చేసుకున్నట్టే అని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఫిల్మ్ కెరీర్ ని ప్రారంభించిన హీరోలలో వరుసగా హ్యాట్రిక్ కొట్టిన హీరోలలో రాజ్ తరుణ్ ఒక్కడే కనిపిస్తున్నాడు. ఇక నిర్మాత విషయానికి వస్తే, స్టార్ డైరెక్టర్ అయిన సుకుమార్ కుమారి21F మూవీకి కథ-స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా, నిర్మాతగానూ ఈ మూవీతో పరిచయం అయ్యాడు.


కేవలం 4 నుండి 5 కోట్ల రూపాయలలో నిర్మించిన ఈ మూవీకి ప్రస్తుతం పెట్టిన పెట్టబడి తిరిగి రాగా, లాభాలతో దూసుకుపోతుందని అంటున్నారు. ఈ సినిమాకి అన్ని ఏరియాలలో సూపర్బ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా నైజాంలో ఈ మూవీ కలెక్షన్స్ తో దమ్మురేపుతుంది. ఇప్పటి వరకూ ఈ మూవీ నైజాంలో 4 కోట్ల రూపాయల షేర్ ని సాధించింది. లాంగ్ రన్ లో ఇది 7 కోట్ల రూపాయల షేర్ ని సాధించటం ఖాయం అని అంటున్నారు.


ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కలెక్షన్స్ ని తో చూస్తే, ఈ మూవీ టోటల్ గా 18 కోట్ల రూపాయల షేర్ ని కొల్లగొట్టవచ్చని అంటున్నారు. అంటే దాదాపు 14 కోట్ల రూపాయల లాభాలు మిగలనున్నాయి. ఇందులో నిర్మాతకి దాదాపు 10 కోట్ల రూపాయల మేర లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక థియోటర్స్, బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీతో లాభాలను చూస్తున్నారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఇక కుమారి21F మూవీ ద్వారా హేభ పటేల్ హీరోయిన్ గా పరిచయం అయింది. మొత్తంగా ఈ మూవీతో నిర్మాతగా సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: