కోలీవుడ్ లో సూర్య నటించిన మూవీలకి మంచి క్రేజ్ ఉంటుంది. సౌత్ లో పాపులారిటి ఉన్న హీరోగా సూర్య ఎదుగుతూ వస్తున్నాడు. బాక్సాపీస్ పరంగానూ సూర్య మూవీలు మంచి కలెక్షన్స్ ని కొల్లగొడతున్నాయి. ఇదిలా ఉంటే సూర్య నటిస్తున్న ప్రతి మూవీని తమిళ తో పాటు, తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు. దీంతో తెలుగులోనూ సూర్య మూవీలు మంచి సక్సెస్ ని సాధిస్తుంటాయి. ఇదిలా ఉంటే, తాజాగా సూర్య నటించిన ఓ సినిమాకి తమిళ్ లోనూ, తెలుగులోనూ థియోటర్స్ దొరకటం లేదు.


దీనికి సంబంధించని వివరాల్లోకి వెళితే, తమిళంతో పాటు తెలుగులోనూ మంచి స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న హీరో సూర్య, ఈ మధ్య కాలంలో తన సొంత బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో వరుస సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. సొంత బ్యానర్ లో వరుస సినిమాలు చేయటం కారణంగా, ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ ని చేసుకోవటంలో కొద్దిగా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తన బ్యానర్‌లో వచ్చిన ‘మాస్’సినిమా సూర్యకు మంచి పేరు తెచ్చింది. అలాగే ఇప్పుడు ‘పసంగ 2’ సినిమాతో కోలీవుడ్ లో మంచి సక్సెస్ పొందాలని చూస్తున్నాడు.


ఇక ఇదే మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను డిసెంబర్ 4న పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు సూర్య టీమ్ సన్నాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా డిసెంబర్ 24కు వాయిదా పడింది. తమిళంతోపాటు, తెలుగులో థియోటర్స్ దొరక్కపోవటంతో ఈ మూవీని క్రిస్‌మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


గత కొంత కాలంగా సూర్య తన సినిమాలతో బాక్సాపీస్ ను పెంచుకోవాలని చూస్తున్నప్పటికీ, థియోటర్స్ సమస్య అనేది తనని ఎంతగానో ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. దీంతో సూర్య మూవీలు ఏకకాలంలో రిలీజ్ కాలేకపోవటంతో, మూవీకి సంబంధించని బిజినెస్ విషయంలో గంధరగోళం ఏర్పడుతుందని అంటున్నారు. ఇక పసంగ2 మూవీలో సూర్య, అమలాపాల్, బింధు మాధవిలు కీలక పాత్రల్లో నటించారు. మానసిక వ్యాధితో బాధపడే చిన్నారుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: