యాంకర్స్ హీరోయన్స్ గా మారుతున్న ఈ సమయంలో, తెలుగు యాంకర్ ప్రశాంతి నటించిన ఓ అడల్ట్ చిత్రం ఎఫైర్ థియోటర్స్ ని హిట్ చేసింది. ఈ మూవీపై చేసిన ఓవర్ పబ్లిసిటి, ఓవర్ మౌత్ టాక్ కారణంగా సినిమా పూర్తిగా నష్టపోయిందని అంటున్నారు. ఎందుకంటే తెలుగులో మొట్టమొదటిసారిగా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడమనే కాన్సెప్ట్‌ ‌తో వచ్చిన ఈ మూవీలో, చెప్పుకోదగ్గ హైలైట్ పాయింట్స్ ఎక్కడా కనిపించకపోవటంతో ప్రేక్షకులు నిరాశ చెందారు.


తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు శ్రీ రాజన్ దర్శకత్వం వహించారు. చిన్న సినిమా అయినా, పబ్లిసిటినీ బాగా చేయటంతో అందరూ ఎఫైర్ మూవీలోని కొత్తదన్నాన్ని చూద్దాం అని థియోటర్స్ వెళ్ళారు. ఈ మూవీ అంతా పాత కథలాగే ఉండటంతో ప్రేక్షకులు దీన్ని థియోటర్స్ వద్ద నుండి తిప్పికొట్టారు. ఇక ఈ మూవీలోని కథ, కథనం రెండూ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. కేవలం హింస, రక్తపాతం వంటివి మాత్రం తీవ్ర స్థాయిలో చూపించారు.


అర్ధం లేని సీన్స్, అర్ధం లేని క్యారెక్టరైజేషన్ వల్ల సినిమాకి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఇక ఈ మూవీపై ఆశలు పెట్టుకు యాంకర్ ప్రశాంతి, మూవీ ప్లాప్ కావటంతో తనకి అవకాశాలు రావటం కష్టంకానే ఉంటుందని అంటున్నారు. ఇక తనకు చెప్పిన కథ ఒకటి, తెరకెక్కించిన కథ ఒకటి అంటూ ప్రశాంతి సన్నిహితులతో చెప్పుకుంటుంది. తీరా మూవీను చూసుకున్న తరువాత, తనకి ఆ విషయం అర్ధం అయిందట.


ఏదైతేనేం, ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న మూవీ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడంతో, తను కొంత కాలం మూవీ ఆఫర్స్ కి దూరంగా ఉండాలని చూస్తుందట. ఇక ఎప్పటిలాగే యాంకరింగ్ చేసుకోవాలని అనుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. నటనా పరంగా చూసుకుంటే రొమాన్స్ ని పండించటంతో ప్రశాంతి బాగానే కష్టపడిందని అంటున్నారు. మొత్తంగా ఎఫైర్ మూవీ రిజల్ట్ ప్రశాంతికి షాకింగ్ ని ఇచ్చిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: