మాస్ మహ రాజ్ రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమా బెంగాల్ టైగర్ రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే తన తర్వాత సినిమా కూడా స్టార్ట్ చేసేశాడు రవితేజ. దిల్ రాజు నిర్మాణ సారద్యంలో వస్తున్న ఈ సినిమాకు ఎవడో ఒకడు అనే టైటిల్ పెట్టారన్న సంగతి తెలిసిందే. ఓ మై ఫ్రెండ్ దర్శకుడు వేణు శ్రీరాం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా మలయాళ ప్రేమం హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఇప్పటికే ఓకే అవగా మరో హీరోయిన్ గా కంచె బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ ని తీసుకున్నారు.


కంచె సినిమాలో తన నటనతో పాటు అందంతో అందరిని మెప్పించిన ఈ సుందరి టాలీవుడ్ ప్రేక్షకులను బుట్టలో వేసుకుంది. అందుకే వరుసెంట ఆఫర్లను చేజిక్కించుకుంటుంది. ప్రస్తుతం లక్కీ హీరోయిన్ అయిన ఈమెను రవితేజ తన సినిమాలో ఉండేలా చేసుకుంటే సినిమాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని భావించారు అందుకే ఆమెను సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా రవితేజలోని మరో కోణాన్ని చూపించబోతున్నారట.


ఓ మై ఫ్రెండ్ వేణు శ్రీ రాం అంటే క్లాసికల్ సినిమా దర్శకుడు అనిపిస్తుంది. అయితే అతను రవితేజకు సరిపోయే కథని రెడీ చేశాడంటే అది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందే విధంగా ఉంటుందని భావిస్తున్నారు రవితేజ ఫ్యాన్స్. కిక్-2 ఫ్లాప్ తర్వాత ప్రస్తుతం ఫోకస్ అంతా బెంగాల్ టైగర్ మీద పెట్టిన రవితేజ ఆ సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. దీపావళికే సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా.. అఖిల్ కోసం తన సినిమాను డిశెంబర్ 10కి పోస్ట్ పోన్ చేసుకున్నాడు.  


మరి బెంగాల్ టైగర్ హిట్ ఇచ్చి ఆ జోష్ తోనే వేణు శ్రీ రాం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో కంటిన్యూ చేసి సూపర్ హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు మాస్ మహరాజ్ అభిమానులు. మరి ప్రగ్యా లక్ రవితేజకు తోడై సినిమా సూపర్ హిట్ అవ్వాలని మరోసారి తన ఫామ్ని కొనసాగించాలని చిత్ర యూనిట్ కూడా భావిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: