సుకుమార్ నిర్మాతగా మారితే ట్రెండ్ సెట్ సినిమాలు చేస్తాడు అని ప్రూవ్ చేశాడు.. దర్శకుడిగా ఎంత డిఫరెంట్ సినిమాలు చేస్తాడో నిర్మాతగా కూడా తన క్రియేటివిటీని ప్రదర్శించి సూపర్ హిట్ కొట్టాడు. రాజ్ తరుణ్ హెబ్బ పటేల్ జంటగా నటించిన కుమారి 21ఎఫ్ సినిమా సుకుమార్ నిర్మించగా సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేశాడు. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో కలక్షన్స్ కూడా భారీగా వచ్చాయని ట్రెడ్ న్యూస్. ఇప్పటికి వారం రోజులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కలక్షన్స్ లో కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తుండటం విశేషం.


మొదటి వారం రోజుల్లో 15 కోట్ల గ్రాస్ కలక్షన్స్ సాధించిన కుమార్ షేర్ వాల్యూ 10 కోట్లకు పైన అని తెలుస్తుంది. సినిమా నైజాంలో 3.90 కోట్లను కలెక్ట్ చేసి చిన్న సినిమాల్లో భారీ విజయం దక్కించుకుంది. ఇక సినిమా ఓవరాల్ గా కూడా ఫుల్ రన్ లో 20 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.. యూత్ ని ఎట్రాక్ట్ చేయడం కోసం సుకుమార్ కాస్త అడల్ట్ కంటెంట్ ని ప్రొడ్యూస్ చేసినా సినిమా మాత్రం లాభాల పంట పండిస్తుండటం విశేషం. కుమారిగా నటించి హెబ్బా పటేల్ తన అందంతో పాటుగా అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.


రాజ్ కూడా తన పాత్ర మేరకు అద్భుత నటనతో అదరగొట్టేశాడు. ఉయ్యాల జంపాల హిట్ తర్వాత సినిమా చూపిస్త మావ కోసం టైం తీసుకున్న రాజ్ తరుణ్.. కుమారి కోసం పెద్దగా టైం గ్యాప్ ఇవ్వకుండానే వెంటనే వదిలి హిట్ కొట్టాడు. సినిమా ఒకవిధంగా ఊహించిన దానికన్నా ఎక్కువ హిట్ మార్క్ టచ్ చేసిందని చెప్పొచ్చు. రీసెంట్ గా సక్సెస్ మీట్ లో కూడా అందరు సినిమా సక్సెస్ జోష్ ని వారి మాటల్లో వివరిస్తూ ఎంజాయ్ చేశారు.


ఈవారం రిలీజ్ అయిన సైజ్ జీరో, తను నేను సినిమాలు కూడా యూత్ ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి కాబట్టి కుమారి ఇంకా మంచి కలక్షన్స్ ని రాబట్టే చాన్స్ ఉంది. మరి చూస్తుంటే ఈ ఇయర్ భలే మగాడు హిట్ తో సెన్షేషన్ క్రియేట్ చేసిన నాని సినిమాను కుమారి బీట్ చేసేలానే ఉంది. కుమారి ఫుల్ రన్ ఎంత కలక్ట్ చేస్తుంది అన్న దాని మీద ఇంకో వారం గడిస్తే గాని వివరణకు వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: