మొన్న విడుదలైన ‘సైజ్ జీరో’ సినిమాకు అటు విమర్శకుల దగ్గర నుంచి కాని ఇటు సాధారణ ప్రేక్షకుల దగ్గర నుంచి కాని సరైన గుర్తింపు రాకపోవడంతో రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ మరొకసారి పరాజయం చెందాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు మరి కొందరైతే బ్లాక్ బస్టర్ తండ్రి ఫెయిల్యూర్ కొడుకు అంటూ ఘాటైన కామెంట్స్ చేస్తూ దర్శకుడు ప్రకాష్ పై విమర్శలు కురిపిస్తున్నారు.

ప్రకాష్ భార్య కనికా ధిల్లాన్ ఇచ్చిన మంచి కథను మంచి సినిమాగా రూపొందించడంలో ప్రకాష్ విఫలమయ్యాడు అంటూ అన్ని వర్గాల నుండి కామెంట్స్ వస్తూ ఉండటంతో ఈ సినిమా విజయం పై అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఈవార్తలు ఇలా ఉండగా టాలీవుడ్ సినిమా ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన ఈసినిమా ప్రీమియర్ షోలో ఒక విచిత్ర సంఘటన జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి.

ఈ ప్రీమియర్ షోకు వచ్చిన చాలామంది సెలెబ్రెటీలు ప్రకాష్ భార్య కనికా ధిల్లాన్ ను చూసి ఒక్క క్షణం షాక్ అయినట్లు టాక్. దీనికి కారణం ఆమె తమన్నా పోలికలతో చాలామందికి కనిపించిందట. దీనితో ‘సైజ్ జీరో’ ప్రీమియర్ షోకు తమన్నా వచ్చిందా అంటూ కొందరు కామెంట్లు చేసుకున్నట్లు టాక్. ఈ విషయం బయటకు రావడంతో ఈ న్యూస్ వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా కనికా తమన్నాల ఫోటోలను జత చేస్తూ చాలామంది వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.

మంచి రచయిత్రిగా పేరు గాంచిన కనికా ‘సైజ్ జీరో’ కథను బాలీవుడ్ హీరోయిన్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథ వ్రాసింది అని టాక్. అయితే ఆ కథ ‘సైజ్ జీరో’ గా మారింది. హీరోగా సినిమా రంగ ప్రవేశం చేసి ఆ తరువాత దర్శకుడుగా మారినా ఇంకా అదృష్టం ప్రకాష్ తలుపు తట్టక పోవడం ఒక విధంగా రాఘవేంద్రరావుకు షాక్ అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: