తెలుగు ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోయిన్ గా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ రకూల్ ప్రితి సింగ్.  ఈ అమ్మడు వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తూ మంచి ఫామ్ లోకి వచ్చింది. అయితే ఈ మద్య విడుదలైన కిక్ 2, బ్రూస్ లీ చిత్రాలు విజయవంతం కాకపోయినా..తన ఇమేజ్ కి ఏమాత్రం డ్యామేజ్ రాలేదు. అంతే కాదు ఇప్పుడు సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న నాన్నకు ప్రేమతో చిత్రంలో నటిస్తుంది.

ఇకబోయపాటి శ్రీను, బన్ని కాంబినేషన్ లో వస్తున్న సరైనోడు చిత్రంలో కూడా ఈ అమ్మడే.. తాజాగా వరుణ తేజ్ సరసన కూడా చాన్స్ కొట్టేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ షూటింగ్ టైమ్ లో ఎప్పుడు జాలీగా గడిపే రకూల్ కి ఓ పిచ్చి ఉందట..అదే సెల్ఫీ ఫోటోలు దిగడం. తనకు కొత్త గా పరిచయం అయిన వాళ్లతో, తనకు నచ్చిన వాళ్లతో నచ్చిన ప్రదేశాలు కనిపిస్తే చాలు వెంటనే సెల్పీ ఫోటో దిగుతుందట.

రకూల్ ప్రితి సింగ్


ఎన్టీఆర్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం నాన్నకు ప్రేమతో. ఈ చిత్ర షూటింగ్ లో తారలు సందడి చేస్తున్నారు.  ఈ చిత్రం షూటింగ్ లో రకుల్ కాస్త ఖాళీ దొరికితే చాలు చిత్ర బృందంతో కలిసి తీసుకున్న సెల్ఫీలను తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుందట. సాధారణంగానే తనకు సెల్ఫీలు తీసుకోవడం అంటే ఎంతో ఇష్టమని అమ్మడే చెబుతుంది. ఇక షూటింగ్ సమయంలో విరామం దొరకడమే ఆలస్యం వెంటనే మొబైల్ తీసుకుని సెల్ఫీలు తీసుకుంటుందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: