జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఆడియో కూడ విడుదల కాకుండానే అప్పుడే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేవలం 3 ఏరియాలలో 31 కోట్ల బిజినెస్ చేయడం టాలీవుడ్ వర్గాలలో సంచలన వార్తగా మారింది. ఈ సినిమా నైజాం రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ రూ.16 కోట్లకు సొంతం చేసుకున్నాడు అనే న్యూస్ హాట్ న్యూస్ గా మారింది. 

ఇప్పటికే ఈసినిమా ఓవర్సీస్ లో 7.10 కోట్లకు అమ్ముడై పోయింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈసినిమాను సీడెడ్ ప్రాంతానికి 8 కోట్లకు పైగా అమ్మకం జరిగింది అన్న వార్తలు రావడంతో కేవలం ఈమూడు ఏరియాల అమ్మకంతోనే జూనియర్ సినిమాకు 31 కోట్ల బిజినెస్ జరిగితే కోస్తా జిల్లాలు ఉత్తరాంద్ర జిల్లాలు కర్ణాటక ప్రాంతం శాటిలైట్ అమ్మకాలతో కలుపుకుంటే జూనియర్ కొత్త సినిమా 60 కోట్ల వరకు బిజినెస్ చేయడం ఖాయం అని అంటున్నారు. 

దీనితో జూనియర్ నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా నిర్మాత ఆ సినిమా విడుదల కాకుండానే లాభాలలోకి వెళ్ళిపోయాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సుకుమార్ లేటెస్ట్ గా నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దాని ప్రభావం జూనియర్ సినిమా పై పడింది అని అంటున్నారు. 

నాలుగేళ్ల కిందట వచ్చిన ‘100% లవ్’ తర్వాత సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమాలు ఏమి హిట్ కాకపోయినా కేవలం ‘కుమారి’ ని నమ్ముకుని జూనియర్ పై బయ్యర్లు చేస్తున్న ఈ సాహసం ఎంతవరకు విజవంతం అవుతుందో రాబోతున్న సంక్రాంతికి తెలుస్తుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: