మ్యూజిక్ మిరకిల్ దేవి శ్రీ ప్రసాద్ హీరో అవుతున్నాడని చెప్పిన దగ్గరనుండి రాక్ స్టార్ ఎలాంటి సినిమా తీస్తాడన్నది ఇప్పుడు ఆడియెన్స్ లో ఈగర్నెస్ పెరిగింది. ఎప్పటినుండో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా చేద్దామనే నిర్మాతలు ప్రయత్నిస్తున్నా దేవి మాత్రం తనకు సరిపోయే కథ రాలేదని నెట్టుకుంటూ వచ్చాడు. కాని ఈసారి మాత్రం దిల్ రాజు దేవి శ్రీ ప్రసాద్ ని హీరోగా చేసేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా సుకుమార్ నిర్మాతగా మారి తీసిన కుమారి 21ఎఫ్ సక్సెస్ సాధించడంతో దేవిని కూడా హీరోగా చేసేయడానికి రాజు పూనుకున్నారు.


దేవి మార్క్ సంగీతంతో వచ్చే ఈ సినిమాకు సుకుమార్ డైరెక్ట్ చేయడం విశేషం. అయితే ఈ సినిమా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీతో వస్తుందని అంటున్నారు. ఆర్య లాంటి ప్రేమకథని తీసిన సుక్కు డైరెక్షన్లో మరోసారి అలాంటి సినిమానే దేవి హీరోగా చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఫీల్ మై లవ్ అంటూ అల్లు అర్జున్ ని స్టార్ హీరోని చేసిన ఆర్య సినిమా సృష్టించిన సంచలనం తెలిసిందే కదా.. ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాజిక్కే సుక్కు దేవిలు చేయబోతున్నారు.


దేవి సుక్కు సినిమా అంటే సంగీతం అదిరిపోద్ది. అయితే ఇక దేవి హీరోగా వచ్చే సినిమా కాబట్టి ఆ సినిమా ఇంకా అదిరిపోయే చాన్స్ ఉంది. ప్రస్తుతం దేవి నటనకు సంబంధించిన పరిపూర్ణనతను నేర్చుకునే పనిలో ఉన్నాడు. ఇక సుకుమార్ కూడా కథ రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో రిలీజ్ అయిన తర్వాత సుక్కు తర్వాత తీసే సినిమా ఇదే అని అంటున్నారు. మరి సుకుమార్ కథ మూలం ఇప్పటికే ఆలోచించాడని అది కూడా ఆర్యలానే వన్ సైడ్ లవ్ అని తెలుస్తుంది.


క్రేజీ కాంబోగా వస్తున్న ఈ సినిమా సుకుమార్ తన క్రియేటివిటీని అంతా ఉపయోగించి సినిమా హిట్ చేస్తాడనడంలో సందేహం లేదు. సినిమా మ్యూజిక్ పరంగా కూడా దేవి చితక్కొట్టడం ఖాయం. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రూపొందించబడె ఈ సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ అవ్వనుంది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: