గత కొంత కాలంగా రామ్ చరణ్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్  తనిఒరువన్ రిమేక్ పై హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన తనిఒరువన్ మూవీ బాక్సాపీస్ వద్ద కాసుల వర్షం కరిచించింది. మూవీకి పెట్టిన పెట్టుబడి కంటే దాదాపు 5 రోట్లు ఎక్కువుగా కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. ఇదిలా ఉంటే...ఈ మూవీని తెలుగులో రామ్ చరణ్ రిమేక్ చేయనున్నాడనే సంగతి తెలిసిందే.

ఈ హీరో నుండి దసరా కానుకగా వచ్చిన ‘బ్రూస్ లీ’ సినిమా మెగా అభిమానులను అంతగా మెప్పించలేకపోవటంతో...తని ఒరువన్ రిమేక్ పై చరణ్ భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఇక ‘తని ఒరువన్’ రీమేక్ గా రానున్న చరణ్ మూవీకి హైలెట్స్ ని చూస్తే ఈ మూవీకి డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి చేస్తున్నాడు. రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సురేందర్ రెడ్డి చేస్తున్న ఈ మూవీపై మార్కెట్ వర్గాల్లో పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.

ఈ మూవీలో కీలకంగా మారిన విలన్ రోల్ పై తాజాగా క్లారిటి వచ్చిందనే టాక్స్ వినిపిస్తుంది. కోలీవుడ్ తని ఒరువన్ మూవీలో విలన్ గా నటించిన అరవింద్ స్వామి నే, తెలుగు రిమేక్ లోనూ నటించనున్నాడు. గత కొంత కాలంగా అరవింద్ స్వామి నటించటం లేదంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు తెరపడినట్టే అని అంటున్నారు.

రామ్ చరణ్, సురేందర్ రెడ్డి, అరవింద్ స్వామి కాంబినేషన్ మార్కెట్ వర్గాలను సంత్రుప్తి పరచటంతో...ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ ని షూటింగ్ సమయంలోనే క్లోజ్ చేసుకునేందుకు పలువురు బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ రెడీగా ఉండటం విశేషం. ఇక ఈమూవీని అల్లు అరవింద్–ఎన్.వి ప్రసాద్ లు కలిసి నిర్మించనున్నారు. ఈ మూవీని తక్కువ షెడ్యూల్స్ లో రామ్ చరణ్ పూర్తి చేయనున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: