ప్రిన్స్ మహేష్ కు కధలు చెప్పి తమ సినిమాలకు ఒప్పుకునేలా ఎందరో టాప్ డైరెక్టర్స్ ప్రయత్నిస్తున్నారు. అయితే మహేష్ కు అత్యంత సన్నిహితుడైన జయంత్ పరంజి కోసం మహేష్ మరో సాహసం చేయబోతున్నాడా అనే వార్తలు వినిపిస్తున్నాయి. క్రియేటివ్ దర్శకుడిగా పేరు ఉన్నా ఈమధ్య కాలంలో సరైన హిట్స్ లేక చాల వెనక పడిపోయిన శేఖర్ కమ్ముల మాయలో మహేష్ ఎందుకు పడుతున్నాడు అంటూ ఆసక్తికర చర్చలు జరుగు తున్నాయి. 

అయితే మహేష్ శేఖర్ కమ్ముల చెపుతున్న కథలను వింటున్నది శేఖర్ కమ్ముల కోసం కాదని మహేష్ కు అత్యంత సన్నిహితుడైన దర్శకుడు జయంత్ పరంజి కోసమని అనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘ప్రేమించుకుందాం రా’, ‘బావగారు బాగున్నారా’, ‘ప్రేమంటే ఇదేరా’ లాంటి ఒకనాటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను తీసిన జయంత్ ఆతరువాత మహేష్ తో చాల సంవత్సరాల క్రితం ‘టక్కరి దొంగ’ సినిమాను తీసాడు. 

ఈసినిమా ఘోరంగా ఫ్లాప్ అయినా మహేష్ జయంత్ ల సాన్నిహిత్యం బాగా పెరగడమే కాకుండా మహేష్ తాను ప్రేమించిన నమ్రతను పెళ్ళి చేసుకునే విషయంలో కృష్ణ కుటుంబాన్ని పెళ్ళికి ఒప్పించడంలో జయంత్ ఆరోజులలో చాల కీలకపాత్ర పోషించాడు అన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. అయితే ఆ తరువాత వారి సాన్నిహిత్యం ఇలాగే కొనసాగుతున్నా మహేష్ సూపర్ స్టార్ కావడంతో జయంత్ కు మరో సినిమా అతడిని నిలబెట్టేందుకు చేయలేకపోయాడు. 

ఈ పరిస్థుతుల నేపధ్యంలో జయంత్ శేఖర్ కమ్ముల కలిసి ఒక సినిమాను మహేష్ తో తీయాలనే ఆలోచన వచ్చిన వెంటనే శేఖర్ కమ్ముల రంగంలోకి దిగి మహేష్ కోసం రకరకాల కథలు తయారు చేస్తున్న నేపధ్యంలో మహేష్ జయంత్ కోసం శేఖర్ కమ్ముల బుట్టలో పడిపోయాడా అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ఈవిషయమై ఒక క్లారిటీ వచ్చే సంవత్సరం వస్తుంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: