తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే అక్కడి అభిమానులకు ఎంత ఇష్టమో వేరే చెప్పనక్కర లేదు. ఒకదశలో రజినీ సినిమా రిలీజ్ అయ్యిందంటే..పెద్ద పండుగ చేసుకుంటారు. ఆ మద్య లింగ సినిమాతో కాస్త నిరుత్సాహంగా ఉన్న రజినీ చాలా కాలం తర్వాత ‘కబాలి’ చిత్రంలో నటిస్తున్నారు. మాఫియా బ్యాగ్ గ్రౌండ్ తరహాలో ఉండే ఈ చిత్రంలో రజినీ తన వయసుకు తగ్గట్టుగానే కనిపిస్తున్నారు. ఇక అయన పెద్దకూతురు భర్త దనుష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

కొత్తలో పెద్దగా విజయాలు సాధించకపోయినా చిన్న చిన్నగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు మంచి కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాదు దనుష్ బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలు తీసి అక్కడ కూడా మంచి ఇమేజ్ సంపాదించాడు. తాజాగా  ధనుష్ హాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. రీసెంట్ గా తమిళంలో ధనుష్ హీరోగా ‘మరియన్’ అనే మూవీ వచ్చింది. ఆ చిత్రంలో ధనుష్ పెర్ఫార్మెన్స్ చూసి ధనుష్ కు హాలీవుడ్ మూవీకు సెలెక్ట్ చేశారట.

రజినీకాంత్ తో ధనుష్


హాలీవుడ్‌లో ధనుష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్ హు గాట్ ట్రాప్డ్ ఇన్ యన్ ఇకియా కప్ బోర్డ్’ అనే టైటిల్ పెట్టారు. ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ ఉమా తుర్మన్ ఈ మూవీలో ధనుష్ సరసన నటిస్తోంది. ప్రముఖ ఇరానియన్-ఫ్రెంచ్ ఫిలిం మేకర్ మార్జాన్ సత్రాపి ఈ మూవీకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో అలెగ్జాండ్రా దద్డారియో మరో హీరోయిన్‌గా నటిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: