క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రుద్రాక్ష’ కు సంబంధించి బయటకు వస్తున్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. 16 నెలలు క్రితం రామ్ చరణ్ తో తీసిన ‘గోవిందుడు అందరివాడేలే’ హిట్ కాకపోవడంతో కృష్ణవంశీ పని అయిపోయింది అని అనుకున్నారు అంతా. అయితే మరింత పట్టుదలతో కృష్ణవంశీ ‘రుద్రాక్ష’ మూవీ ప్రాజెక్ట్ ను డిజైన్ చేయడమే కాకుండా ఈసినిమాకు ఖర్చు పెట్టబోతున్న బడ్జెట్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీకి ఈ స్థాయిలో బడ్జెట్ ఖర్చు పెట్టడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరితో పాటుగా ప్రకాష్ రాజ్ కూడ ఒక ముఖ్య పాత్రను ఈసినిమాలో పోషిస్తున్నాడు. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమా పై 60 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు అని టాక్. ఈసినిమా కథ అంతా ఒక ‘రుద్రాక్ష’ చుట్టూ శివ తత్వం నేపధ్యంలో జరుగుతుంది కాబట్టి కృష్ణ వంశీ ఈసినిమాలోని విజువల్ ఎఫెట్స్ కు చాల ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే సీనియర్ కెమెరా మేన్ ఛోటా కె నాయుడు లాంటి ఖరీదైన టెక్నిషియన్స్ ను ఈసినిమాకు కృష్ణవంశీ సాంకేతిక నిపుణులుగా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈసినిమా విజువల్ ఎఫట్స్ ను ‘బాహుబలి’ స్థాయిలో తీసుకు రావడానికి కృష్ణవంశీ ఒక ప్రముఖ అంతర్జాతీయ కంపెనీతో ఈసినిమా గ్రాఫిక్ వర్క్స్ విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాను ఒక తెలుగులోనే కాకుండా తమిళంలో కూడ ఏక కాలంలో నిర్మించి రమ్యకృష్ణకు సమంతకు ఉన్న క్రేజ్ రీత్యా అటు టాలీవుడ్ లోను ఇటు కోలీవుడ్ లోను కలక్షన్స్ సునామీ సృష్టించాలని కృష్ణవంశీ చేస్తున్న సాహసం చూసి సమంతతో రమ్యకృష్ణ వంశీయమ్ అన్న సెటైర్లు పడుతున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: