ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి మంచు విష్ణు షాక్ లో ఉన్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. భరణి ‘మిధునం’ తరువాత హీరో శర్వానంద్ తో ‘ఊరి చివరి గుడిసె’ పేరుతో ఓ సినిమాను తీద్దామనుకున్నాడు. అయితే ఆ సినిమా చర్చల వరకే ముందుకు జరిగి ఆ తరువాత ఆగి పోయింది. ఆ తరువాత భరణి ఎంతో పరిశోధన చేసి ‘భక్తకన్నప్ప’ స్క్రిప్ట్ ను తయారు చేసి సునీల్ హీరోగా తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అయితే మొదట్లో ఈ స్క్రిప్ట్ పై ఆసక్తి చూపించిన సునీల్ ఆ తరువాత ఈ మూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. 

ఈ నేపధ్యంలో ఈ విషయం తెలుసుకుని మంచు హీరో విష్ణు ఈ సినిమాను తన సొంత బ్యానర్ 24ఫ్రేమ్స్ ఎంటర్టైన్ మెంట్స్  పై  భారీ స్థాయిలో నిర్మిస్తానంటూ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కు చాల భారీ బడ్జెట్ అవసరం కాబట్టి మంచు విష్ణు ఇంత వరకు లోకల్ బ్యానర్ గా ఉన్న 24ఫ్రేమ్స్ ఎంటర్టైన్ మెంట్స్ ను ఇంటర్నేషనల్ బ్యానర్ గా చేసి ఈ సినిమాను అమెరికాలోని ఒక వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ తో కలిసి నిర్మించడానికి గట్టి ప్రయత్నాలు చేసాడు.

అయితే ఆ వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ బృందం ఈ ప్రాజెక్ట్ విషయంలో చెప్పిన మార్పులను చేయడంలో తనికెళ్ళ భరణికి విష్ణు కు  క్రియేటివ్ విభేదాలు రావడంతో ఈ సినిమా ఆగిపోయింది అన్న ప్రచారం జరుగుతోంది. దీనిని బట్టి చూస్తూ ఉంటే ఎప్పటికైనా ఈ భక్త కన్నప్ప మళ్ళీ రీమేక్ జరిగితే అది ప్రభాస్ తోనే జరిగే అవకాశం ఉందా అని అనిపించడం సహజం. 

క్రియేటివ్ సినిమాలను తీసి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని ప్రయత్నిస్తున్న తనికెళ్ళ భరణి లాంటి దర్శకులు ఇంత భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా చిన్న సినిమాలు తీస్తే బాగుటుంది అని అనిపించడం సహజం. ఏది ఏమైనా ఇప్పట్లో ‘భక్తకన్నప్ప’ వచ్చే అవకాశం లేదు అని అనిపిస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: