గతంలో పీవీపీ సంస్థ అంటే భారీ సినిమాలకు ఫైనాన్షియర్ సపోర్ట్ ని ఇచ్చే సంస్థగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఆ పీవీపీ సంస్థే స్వయంగా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఎప్పుడైతే సినిమా రంగంలోకి అడుగుపెట్టిందో అప్పటి నుండి మంచి విజయాలను అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా లాభాలను కూడ చూస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలుగు, తమిళ్ భాషల్లో పీవీపీ సంస్థ పలు భారీ చిత్రాలను నిర్మించింది.


ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో మరోసారి వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించటానికి రెడీ అవుతుంది. తాజాగా ‘క్షణం’ అనే ప్రయోగాత్మక సినిమాను ఈ సంస్థ సిద్ధం చేసింది. కనిపించకుండా పోయిన ఓ మూడేళ్ళ పాపను వెతికే ప్రయాణనే ఈ సినిమా నేపథ్యం. ఈ సినిమాలో అడవి శేష్, అదాశర్మ, యాంకర్ అనసూయ, సత్యదేవ్ వంటి వారు నటించారు. ఇదిలా ఉంటే పీవీపీ సంస్థ అధినేత అయిన ప్రసాద్...సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్స్ తో వరుస సినిమాలు చేయటానికి రెడీ అయ్యాడు.


ఆ నేపథ్యంలోనే ఓ పది మంది హీరోయిన్స్ తో ప్రసాద్ ఇప్పటికే మాట్లాడి వారి కాల్షీట్స్ ని తీసుకున్నాడంట. ఇందులో యాంకర్ స్థాయి నుండి హీరోయిన్ గా చూస్తున్న వారు, అలాగే చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయిలో ఉన్న హీరోయిన్స్ అందరూ ఉన్నారు. పీవీపీ సంస్థ, హీరోయిన్స్ తో భారీ ఎత్తున చేసుకుంటున్న డీల్స్, ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.


కేవలం హీరోయిన్స్ తోనే పీవీపీ సంస్థ ఎందుకు అగ్రిమెంట్స్ చేసుకుంటుంది? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి అనేది? ఎవ్వరికి అంతుపట్టడం లేదుంట. ఇక ప్రస్తుతం పీవీపీ సంస్థ నిర్మించిన ‘క్షణం’ సినిమా ఒక థ్రిల్లింగ్ కథతో తెరకెక్కింది. మార్చి 4న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో యాంకర్ అనసూయ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: