నందమూరి బాలకృష్ణ ఈమధ్య కాలంలో వేస్తున్న సెటైర్లకు సినిమా ఫంక్షన్స్ కు వస్తున్న వారు అంతా అదిరిపోతున్నారు. గంభీరంగా ఉండే బాలకృష్ణ తనకు జోష్ వచ్చింది అంటే చాలు ఎలాంటి వారి పైన అయినా సెటైర్లు వేస్తూ తెగ నవ్వించడం ఈ మధ్య బాలయ్యకు అలవాటుగా మారింది. బాలకృష్ణ మనసులో ఏదీ పెట్టుకోడు అన్న ఉద్దేశ్యంతో ఈ సెటైర్లను అందరూ లైట్ గా తీసుకుంటారు.

రెండురోజుల క్రితం ఈ విషయాలకు కొనసాగింపుగా ‘గుంటూర్ టాకీస్’ మూవీ ట్రైలర్ లాంచింగ్ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన బాలకృష్ణ ఆ కార్యక్రమ వ్యాఖ్యాత శిల్పా శెట్టిని టార్గెట్ టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరిచాయి. కొంతకాలం క్రితం ఒక సినిమా ఫంక్షన్ లో తాను అతిధిగా పాల్గొంటున్నప్పుడు ఆ కార్యక్రమానికి యాంకరింగ్ చేసిన శిల్పను ఆట పట్టించడానికి ఆమె తొడ పై గట్టిగా కొట్టిన విషయాన్ని బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

అయితే తనుకోట్టిన తొడ దెబ్బకు యాంకర్ శిల్ప ఒక సంవత్సర కాలం నొప్పితో బాధ పడిందని ఈ విషయాన్ని ఆమె తనకు స్వయంగా చెప్పిందని నవ్వుతూ ఆనాటి విషయాన్ని గుర్తుకు చేస్తూ అందికీ షాక్ ఇచ్చాడు బాలయ్య. ‘డిక్టేటర్’ మూవీ ప్రమోషన్ లో కూడ బాలయ్య ఇదేవిధంగా అంజలిని గిల్లి సంచనం కలిగించిన విషయం తెలిసిందే. 

అయితే బాలకృష్ణ ప్రస్తుతం వేస్తున్న సెటైర్లు చూసిన వారు మాత్రం వయస్సు పెరిగే కొద్ది బాలయ్య గోపాల కృష్ణుడులా మారిపోతున్నాడు అంటూ ‘గుంటూర్ టాకీస్’ ట్రైలర్ లాంచింగ్ ఫంక్షన్ కు వచ్చిన కొందరు తమలోతాము కామెంట్ చేసుకున్నట్లు టాక్. అయితే నందమూరి సింహం ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా అసలు పట్టించుకోడు అన్న విషయం అందరికీ తెలిసిందే..  


మరింత సమాచారం తెలుసుకోండి: