ఈ మధ్య కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చిన మెగా హీరోలలో, వరుణ్ తేజ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. మెగాహీరో వరుణ్ తేజ్ ముకుంద,కంచె,లోఫర్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి జోరుమీద ఉన్నాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా ‘రాయబారి’. కంచె సినిమాతో తనకి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిన డైరెక్టర్ క్రిష్ తోనే ఈ మూవీని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని జార్జియాలోని లొకేషన్స్ చిత్రీకరేంచేందుకు ప్లానింగ్స్ జరుగుతున్నాయి.


అయితే ఇది వరుణ్ తేజ్ కి నాలుగో చిత్రం కావటంతో….వరుణ్ తేజ్ సైతం తన హీరోయిన్స్ విషయంలో ఓ క్లారిటికి వచ్చాడు. ఈ మూవీలో ఇద్దరి హీరోయిన్స్ కావాలంటూ పట్టుబడ్డాడంట. దీంతో ఈ రాయబారి మూవీలో వరుణ్ తేజ్ ఇద్దరు హీరోయిన్స్ సరసన రొమాన్స్ చేయనున్నారు. మొదటి హీరోయిన్ గా ప్రాగ్య జైశ్వాల్ అయితే, రెండో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఆలోచిస్తున్నారు.


ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఎక్కువుగా ఫారిన్ లొకేషన్స్ లోనే చిత్రీకరణ జరుకోనుంది. ఇందుకు 50 రోజుల భారీ ఫారిన్ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు. అలాగే హీరోయిన్స్ విషయంలో ఇంత క్లారిటీ ఉన్న వరుణ్ తేజ్, మరో అడుగు మందుకేసి తనకి ఈ మూవీలో ఘూటుగా ఉండే ఐటెం సాంగ్ కూడ కావాలని కోరాడంట. ఇందులో మరో స్పెషల్ బ్యూటీని తీసుకోవాలని డైరెక్టర్ క్రిష్ కి వరుణ్ తేజ్ చెప్పారని అంటున్నారు.


గ్లామర్ పరంగా వరుణ్ తేజ్ చెబుతున్న డిమాండ్స్ ని తీర్చటానికి, డైరెక్టర్ క్రిష్ చాలానే ఇబ్బందులు పడుతున్నాడుని తెలుస్తుంది. మెగాహీరో కావటంతో ఇక చేసేది ఏమి లేక, వరుణ్ కోరిక ప్రకారం రాయబారి మూవీలో గ్లామర్ కి కూడ ప్రాముఖ్యత ఇవ్వనున్నాడు క్రిష్. ఈ మూవీపై వరుణ్ తేజ్ భారీ హోప్స్ ని పెట్టుకుంటున్నాడని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: