టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేనరిజాలు, ఫ్యాన్ ఫాలోయింగ్, వంశంతో అంటి పెట్టకొని ఉండే అభిమానులు ఇలా ఓ సపరేటు స్ట్రాటజిక్ ఈక్వేషన్స్ ఏర్పడినప్పుడు కఛ్చితంగా సినిమా సక్సెస్ లో ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఎవరి ఫ్యాన్స్ కి తగ్గట్టుగా హీరోలు, వారి మూవీలను సెలక్ట్ చేసుకుంటారు. ఫ్యాన్స్ కి డైలాగ్స్ ఇష్టం అయితే కచ్ఛితంగా హీరోలు డైలాగ్స్ ని మాత్రమే నమ్ముకుంటారు.


ఈ విధంగా ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో అక్కినేని, నందమూరి,మెగా, విక్టరీ ఫ్యాన్స్ అంటూ నాలుగు ప్రధానమైన వర్గాలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ జాబితాలోకి ఘట్టమనేని వంశం కూడ జాయిన్ అయింది. వీరిలో నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ ఫైట్  జరుగుతూనే ఉంటుంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరికొకరు పోటీ పడి కొట్టుకున్న సందర్భాలు కూడ ఉన్నాయి.


అయితే తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే…ఈ ఇద్దరు అభిమానులు ముక్కన వేలేసుకొని సినిమా చూడాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఇండస్ట్రీలో ఓ అరుదైన మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతుందోన్న విషయం తెలిసిందే. దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి ఓ బలమైన కథను సిద్ధం చేస్తున్నారు. ఇద్దరు హీరోలుండే మల్టీస్టారర్ మూవీలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ని, మెగా హీరో సాయిధరమ్ తేజ్‌‍లను ఒప్పపించాడంట.


దాదాపు ఇద్దరూ సినిమాను ఓకే చేప్పేశారని తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న నందమూరి నటసింహం బాలయ్యా బాబు ఒక్కసారిగా షాక్ అయ్యాడని అంటున్నారు.  ఇదే జరిగితే నందమూరి అభిమానులు, మెగా అభిమానులు థియోటర్స్ లో కలిసి కూర్చుని సినిమా చూడటం జరిగే పనేనా? అని అంటున్నారు. ఇదే జరిగితే కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్ కొత్త చరిత్రకి శ్రీకారం చుట్టినట్టే అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: