ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫాంలో ఉన్న హీరో గోపిచంద్? ‘సౌఖ్యం’ సినిమా తనకి ఆశించినంత సక్సెస్ ని ఇవ్వకపోయినప్పటికీ…తను హీరోగా మరో క్రేజీ మూవీ రానుంది. గోపీచంద్ ఓ డిఫరెంట్ కథాంశంతో చేస్తున్న కమర్షియల్ సినిమా ‘ఆక్సిజన్’ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారింది. ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్.రత్నం కుమారుడు ఏ.ఎమ్.జ్యోతికృష్ణ ఈ ఆక్సీజెన్ మూవీ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని, సెట్స్ పైకి వెళ్లటానికి రెడీగా ఉంది. ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ రాశీ ఖన్నా గ్లామర్ పరంగానూ కొద్దిగా రెచ్ఛిపోనుందని అంటున్నారు. ఇప్పటి వరకూ ఎక్కువుగా సింగిల్ హీరోయిన్ తోనే సరిపెట్టుకోవాలని చూసే గోపీ చంద్…ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడు.

దీంతో ఆక్సీజెన్ మూవీలో గోపిచంద్ సరసన నటించటానికి మలయాళ బ్యూటీ ఎమ్మాన్యుయెల్ ని ఎంపిక చేసారు. ఎమ్మాన్యుయెల్ ఈ మూవీలో మరింత ఘాటుగా కనిపంచనుంది. ఈ బ్యూటీని కేవలం బోల్డ్ గా చూపించటం కోసం తీసుకున్నారు అనే టాక్స్ చిత్ర యూనిట్ లో స్పష్టంగా వినిపిస్తున్నాయని అంటున్నారు. ఎమ్మాన్యుయెల్పాత్రలో మొదటగా కీర్తి సురేష్ ని తీసుకోవాలని చూశారు.

కానీ కీర్తి సురేష్ బోల్డ్ యాక్టింగ్ చేయనని చెప్పటంతో….ఇక ఎమ్మాన్యుయెల్ ని రంగంలోకి దించాడు డైరెక్టర్. ఎమ్మాన్యుయెల్ ఎంపికలో పూర్తి నిర్ణయం డైరెక్టర్ జ్యోతికృష్ణ దే అని అంటున్నారు. ఈ బ్యూటీ రీసెంట్ గా మలయాళ స్టార్ నివిన్ పాళీ నటించిన యాక్షన్ హీరో బిజులో నటించింది. మొత్తంగా టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరో గోపిచంద్ అని తెలుసుకున్న తరువాతనే ఎమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్ఛిందట.


మరింత సమాచారం తెలుసుకోండి: