వినాయక్ దర్శకత్వంలో అఖిల్ ని హీరోగా లాంచ్ చేస్తూ వచ్చిన ‘అఖిల్’ ఘోర పరాజయం అఖిల్ కేకాకుండా వినాయక్ కు కూడ పీడకలలా మారిన విషయం తెలిసిందే. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా గత దీపావళికి వచ్చిన ఈ సినిమా  భాక్సాఫీస్ వద్ద పొందిన ఘోర పరాజయం గత సంవత్సరం టాలీవుడ్ కు షాకింగ్ న్యూస్ గా  మారిన విషయం తెలిసిందే. 

అయితే ఈ సినిమా విడుదల తరువాత ఈసినిమాను కొనుక్కున్న బయ్యర్స్ ఘోరంగా నష్ట పోవడంతో వినాయక్ ఆ బయ్యర్లకు ఏర్పడ్డ కొంత నష్టాన్ని పూడ్చడానికి ముందుకు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. జరిగిపోయిన ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన రూమర్ చాలామందికి షాకింగ్ న్యూస్ గా మారింది.

‘అఖిల్’ సినిమాను కొన్న బయ్యర్స్ కు వచ్చిన నష్టం పంచుకోవడంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించడానికి వినాయిక్ తన ఇంటిని రూ. 20 కోట్లకు అమ్మేశాడని ఫిల్మ్ నగర్ లో హడావిడి చేస్తున్న గాసిప్పులు ఎవరు ఎందుకు పుట్టించారో అర్ధం కాక వినాయక్ సన్నీహితులు షాక్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు వినాయక్ అంటే గిట్టని వారు ఎవరో ఈ వార్తలను పుట్టించి ఉంటారని వినాయక్ సన్నిహితులు కామెంట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మెగా స్టార్ చిరంజీవితో మరోసారి సినిమా చేస్తున్నవినాయక్ పై ఆసూయతో ఈవార్తలు పుట్టించారు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్య వినాయక్ తన ఇంటిలో వాస్తు బాగోలేదని మార్పులు చేయిస్తూ ఉంటేఇలాంటి గాసిప్పులు వినాయక్ పై రావడం వినాయక్ సన్నిహితులను కలవర పెడుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: