భారత దేశంలో ప్రముఖ కంపీనలకు, ప్రభుత్వ సంబంధిత ప్రసారాలకు సినీతారలను తీసుకోవడం పరిపాటే. ముఖ్యంగా ప్రైవేటు యాడ్స్ కి అయితే టాప్ హీరోలు, హీరోయిన్ల, క్రీడాకారులను తమ బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంటారు. తాజాగా ప్రసార భారతి బోర్డు పార్ట్టైమ్ (తాత్కాలిక సభ్యురాలు) మెంబర్గా బాలీవుడ్ అందాల కలువభామ కాజోల్ ఎంపికయ్యారు. కాజోల్తోపాటు శశి శేఖర్ వెంపటి ఎంపికయ్యారు.
ఉపరాష్ట్రపతి హమీద్ హన్సారీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ సూచన మేరకు సినీ రంగం నుంచి బాలీవుడ్ నటి కాజోల్ ని తీసుకుంటున్నట్లు తెలిపింది. ఆన్లైన్ మీడియా రంగంలో విశిష్ట అనుభవం కలిగిన శశి శేఖర్ వెంపటి ని సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ కమిటీలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చీఫ్ సీకే ప్రసాద్, ఇంటిలిజెన్స్ బ్యూరో సునీల్ అరోరా సభ్యులుగా ఉన్నారు.