‘బాహుబలి’ ఘన విజయం తరువాత నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళి తన వ్యక్తిగత జీవితంలో మటుకు చాల నిరాడంబరంగా ఉంటాడు అని అతడి సన్నిహితులు అంటూ ఉంటారు. అంతేకాదు రాజమౌళి విలాస వంతమైన కార్లు అదే విధంగా విలాస వంతమైనవస్తువులు వాడాడు. 

అంతేకాదు ఎటువంటి నెగిటివ్ గాసిప్ వార్తలలోను రాజమౌళి పేరు ఎప్పుడూ కనిపించలేదు. అయితే అటువంటి రాజమౌళి పూర్తిగా మారిపోయాడా అన్న సందేహం కలుగుతోంది. దీనికి కారణం లేటెస్ట్ గా ఈ జక్కన్న తీసుకున్న నిర్ణయం. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం రాజమౌళి ముంబాయిలోని అత్యంత కాస్ట్ లీ ఏరియా అయిన బాంద్రాలోని ఒక కాంప్లెక్స్ లో 14వ అంతస్తులో రాజమౌళి ఆఫీస్ చాల భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 

ఈ నిర్ణయం వెనుక ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాజమౌళి సన్నిహితుడు కరణ్ జోహార్ సూచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలను రాజమౌళి తీసినా ఈయనకు విలాసవంతమైన ఆఫీసులు ఏమి హైదరాబాద్ లో లేవు. 

అయితే దీనికి భిన్నంగా రాజమౌళి ప్రముఖ బాలీవుడ్ సెలెబ్రెటీలు పారిశ్రామిక వేత్తలు ఉండే బాంద్రా ఏరియాలో రాజమౌళి తన ఆఫీసును పెడుతూ ఉండటం అందరికీ షాకింగ్ గా మారింది. ‘బాహుబలి 2’ విడుదల తరువాత రాజమౌళి కరణ్ జోహార్ కు ఒక సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు ఇప్పటికే వచ్చినా ‘బాహుబలి 2’ విడుదల కాకుండానే రాజమౌళి ఇంత ఖరీదైన ఆఫీసును ముంబాయిలో ఎందుకు పెడుతున్నాడు అన్నది ప్రస్తుతానికి  సస్పెన్స్..    



మరింత సమాచారం తెలుసుకోండి: