ఈ మధ్య కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న సినిమాలు వరుస సక్సెస్ లను చూస్తున్నాయి. దీని కారణంగా అటు నిర్మాతలు, ఇటు హీరోలు…అలాగే దర్శకులు, ఇతర ఆర్టిస్ట్ లు అందరూ లాభాలను చూస్తున్నారు. సినిమా కచ్ఛితమైన ఫార్ములాతో నిర్మాతలు తెరకెక్కించటం…అలాగే కఛ్చితమైన కథలను హీరోలు సెలక్ట్ చేసుకోవటం వంటి విషయాలు సినిమా సక్సెస్ కి కారణం అవుతున్నాయి.


దీంతో ఈ మధ్య కాలంలో విపరీతమైన లాభాలను చూసిన హీరోలలో ఒకరు మహేష్ బాబు. ఒక్క శ్రీమంతుడు మూవీకే మహేష్ బాబుకి దాదాపు 50 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. దీంతో హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ సెలబ్రిటీలు అయిన చిరంజీవి, నాగార్జున, ప్రకాష్ రాజ్ వంటి వారు భూములు కొనుగోలు కొంటున్నారు. ఇప్పుడు మహేష్ బాబు సైతం తాజాగా ఓసియన్ పార్క్ సమీపంలో 3 ఎకరాల భూమిని ఫాంహౌస్ చేసే పనిలో ఉన్నాడు.


ఇప్పుడు ఈ కోవలోకి మరోస్టార్ హీరో అయిన జగపతి బాబు అక్కడ భూములు కొంటున్నాడనే ప్రచారం జరుగుతుంది. శ్రీమంతుడు మూవీ తరువాత జగపతిబాబుకి భారీ డిమాండ్ పెరిగింది. తనకు ఉన్న కొద్దిపాటి ఆర్ధిక ఇబ్భందుల నుండి బయట పడి లాభాలను చూస్తున్నాడని అంటున్నారు. ఇక తన దగ్గర ఉన్న డబ్బుతో మహేష్ కొన్న భూమికి దగ్గరలోనే ఒక ఎకర స్థలంని కొనాలని చూస్తున్నాడంట. మొత్తంగా ఈ మధ్యకాలంలో భారీగా సంపాదించిన స్టార్స్ అంతా ఎక్కడోచోట స్థలాలను కొనుక్కోవటం జరుగుతుంది. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి తరుణమే అని అంటున్నారు.


గతంలో స్థలాలను అమ్ముకుంటున్న స్టార్స్…ఇప్పుడు స్థలాను కొనటంతో ఇండస్ట్రీలో సక్సెస్ రేటు పెరగటమే అందుకు కారణం అని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జగపతి బాబు చేతిలో 8 చిత్రాల వరకూ ఉన్నాయి. అన్నీ చిత్రాలలోనూ జగపతిబాబు లీడ్ రోల్ చేస్తున్నాడు. అలాగే ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలను చేస్తూనే…మరోవైపు సొంత నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసి సినిమాలను నిర్మించేందుకు ప్లానింగ్స్ చేసుకుంటున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: