ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ కి సంబంధించిన టాక్స్ హాట్ హాట్ గా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే, ‘బ్రూస్ లీ’ సినిమా తరువాత రామ్ చరణ్ తేజ్ చేస్తున్న సినిమా సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతుంది. ఫిబ్రవరి 21 నుంచి సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేయనున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.


తని ఒరువన్ కి రిమేక్ గా వస్తున్న ఈ మూవీపై రామ్ చరణ్ భారీ అంచానలు పెట్టుకున్నాడు. ఈ మూవీ కచ్ఛితంగా గ్రాండ్ సక్సెస్ ని సాధిస్తుంది కాట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ తరవాత మూవీ ని గొప్ప కాంబినేషన్ ప్లాన్ చేయాలని చరణ్ భావిస్తున్నాడంట. అందుకే రామ్ చరణ్ సుకుమార్ తో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇటీవలే సుకుమార్ ని కలిసిన రామ్ చరణ్…తనకో లవ్ స్టోరీ మూవీని రెడీ చెయ్యాల్సిందిగా కోరాడు.


దీంతో చరణ్ ని కలిసి ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ స్టొరీ లైన్ ని సుకుమార్ చెప్పాడు. ఈ స్టోరికి చరణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో సురేందర్ రెడ్డితో చేస్తున్న తనిఒరువన్ తెలుగు రిమేక్ ఫిబ్రవరి 21న మొదలై, జూలై లో పూర్తి చేస్తున్నారు. ఆ తరువాత అక్టోబర్ నుండి సుకుమార్ తో సినిమా సెట్స్ మీదకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ కాంబినేషన్ కి నిర్మాతగా అల్లుఅరవింద్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఈ విషయంలో సుకుమార్ ని రామ్ చరణ్ బాగా బలవంతం పెట్టడం కారణంగానే సుకుమార్ ఒప్పుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.


నిజానికి సుకుమార్ వద్ద ఎటువంటి కథలు లేనప్పటికీ…చరణ్ మాత్రం అందుకు సుకుమార్ ని గట్టిగా పట్టకొని తనతో మూవీని కన్ఫర్మ్ చేయించుకున్నాడంట. ఈ ప్రాసెస్ లో చరణ్ పై సుకుమార్ సీరియస్ అయ్యాడని తెలిసింది. ఇప్పుడు కథ కోసం సుకుమార్ ఇబ్బంది పడుతుండగా…చరణ్ మాత్రం సుకుమార్ కాంబినేషన్ ఓకే అయినందుకు హ్యాపీగా ఉంటున్నాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: