ఈ మద్య సినిమా యాక్టర్లు  రక రకాల ఫీట్స్ చేసి జనాలను అబ్బుర పరుస్తున్నారు. ఆ మద్య చెన్నై వరద బాధితుల కోసం షాపింగ్ మాల్స్ కి డైరెక్టు గా వెళ్లి విరాళాలు సేకరించి బాధితులను ఆదుకున్నారు. ఇక అప్పుడప్పుడు మరణానికి చేరువలో ఉన్న పేషెంట్లు తమ ఆఖరి కోరిక తీర్చడానికి హీరోలు వారి వద్దకు వెళ్లి గిఫ్టు లు ఇచ్చి వారిని ఆనందింప చేస్తున్నారు. వారికి మనో ధైర్య చెబుతున్నారు.. అంతే కాదు వారి ఆసుపత్రికి అయ్యే ఖర్చు కూడా భరిస్తున్నారు.

తాజాగా అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్  సిసింద్రి చిత్రంతో చిన్ననాడే ఎంట్రీ ఇచ్చాడు. ఆ మద్య మనం సినిమాలో క్లయిమాక్స్ లో దుమ్మురేపే ఎంట్రీ ఇచ్చాడు.. తర్వాత ‘అఖిల్’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్ద విజయం సాధించక పోయినా అఖిల్ కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి..మాస్ అభిమానులు కోరుకునే డ్యాన్స్, ఫైట్స్ లో మనోడు బాగానే ఇరగదీశాడు. తాజాగా అఖిల్   కొత్త అవతారం ఎత్తాడు..అది తన బుల్లి అభిమాని కోసం.

వివరాల్లోకి వెళితే..ఖమ్మం లో ఉన్న ఆరేళ్ల అశ్విత్ రెడ్డి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అఖిల్ చూడడమే తన కోరిక అని మంచులక్ష్మి సేవ సంస్థకి తెలియజేశాడు. విషయం తెలుసుకున్న అఖిల్ ఆ బాబుని కలవాలని వెళ్లాడు. ఇక్కడే మన హీరో తన హీరోయిజాన్ని చూపించాడు..అశ్విత్ కోసం ఓ ఆటో తీసుకొని దాన్ని నడిపి రూ.3000 సంపాదించి ఆ బాబుకు గిఫ్టుగా ఇచ్చాడు. దీంతో ఆ చిన్నారితో పాటు కుటుం సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలాగే సేవా సంస్థ నుంచి మూడు లక్షల రూపాయలు అశ్విత్ చికిత్సకు అందాయి. అఖిల్ వచ్చిన విషయం తెలిసి అభిమానులు భారీగా గుమిగూడారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: