పూరి జగన్నాథ్ కేవలం అతి తక్కువ టైంలో సినిమాలను ఫినిష్ చేస్తూ రికార్డులను క్రియేట్ చేయగల దర్శకుడు. చేసే సినిమా స్టార్ హిరోదైనా కుర్ర హీరోదైనా పూరి స్టార్ కెమెరా యాక్షన్ అంటే అది సరిగ్గా మూడు నెలల్లో మడతెట్టెయాల్సిందే. అయితే హిట్ అయిన సినిమాలకు ఇది ఓకే అనిపించినా ఫ్లాప్ అయితే పూరి అజాగ్రత్త వల్లే సినిమా పోయింది అనే మాటలు వినపడుతున్నాయి.


ఏది ఏమైనా డైరక్టర్ పూరి టాలెంట్ అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం పూరి రోగ్ అంటూ కన్నడ హీరో ఇషాన్ తో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత నందమూరి హీరోల డేట్స్ తీసుకున్న పూరి ముందు కళ్యాన్ రాం సినిమా చేస్తాడని తెలుస్తుంది. కళ్యాన్ రాం హీరోగా రీమిక్స్ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. తన కథలతోనే కాదు తన టైటిల్స్ తో అదరహో అనిపించే పూరి ఈసారి రీమిక్స్ అంటూ వెరైటీ టైటిల్ పెట్టాడు.


క్యూట్ లుక్స్ తో సురభి :


ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నిర్మించబడుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సురభిని తీసుకునే ఆలోచనల్లో ఉన్నారట చిత్ర యూనిట్. ఇప్పటికే ఎక్స్ ప్రెస్ రాజా హిట్ తో మంచి జోరు మీదున్న ఈభామ పూరి చేతిలో పడితే స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం అనేస్తున్నారు. బీరువా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సురభి రఘువరన్ బి టెక్ అనే డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకులకు అంతకుముందే పరిచయమయ్యింది. 


ప్రస్తుతం ఆమెను తన సినిమాలో తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడట పూరి. కళ్యాన్ రాం యాక్షన్, పూరి టేకింగ్, సురభి అందాలు ఇక సినిమాకు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. కొద్దిరోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న పూరి ఈ సినిమాతో తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. మరి ఈ సినిమా అయినా పూరి మార్క్ హిట్ సాధిస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: