ఎక్కువగా సుదీర్ బాబు ఆడియో , ట్రైలర్ లాంచ్ లలో మాత్రమే కనిపించే మహేష్ బాబు ఇన్నాళ్ళ తరవాత రియలిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకి ఎక్కిన ' క్షణం ' ట్రైలర్ లాంచ్ కి వెళ్ళాడు. ఆయనతో పాటు హీరోయిన్ సమంత కూడా పాల్గొనడం విశేషం. ఈ సినిమా లో హాట్ యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ నటిస్తూ ఉండగా హీరో గా అడవి శేష్ , హీరోయిన్ గా అదా శర్మ కనపడతారు. ఈ సినిమా ట్రైలర్ ని మహేష్ - సమంత లు కలిసి లాంచ్ చేసి యూనిట్ ని అభినందించారు. ట్రైలర్ చాలా కొత్తగా థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది.


అడవి శేష్ కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా వేరే వాడిని పెళ్ళిచేసుకున్న అమ్మాయి గా అదా శర్మ కనిపిస్తుంది. ఆమె కూతురు కిడ్నాప్ అవడం తో అమెరికా లో సెట్టిల్ అయిన శేష్ అన్నీ ఒదులుకుని ఆమె కూతురిని వెతికే పనిలో పడతాడు. నిజంగా ఆమె పాప కిడ్నాప్ అయ్యిందా ? అసలు ఆమెకి పాప ఉందా ? అనే ఆసక్తికర కథాంశం తో క్షణం ట్రైలర్ చాలా ఆసక్తికరంగా మారింది. చూస్తుంటే డైరెక్టర్ రవికాంత్ పేరపు ఈ సినిమా తో ఇండస్ట్రీ లో కొత్త బౌండరీ లు సృష్టించే లా కనిపిస్తున్నాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: